Group-1 results | గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు ఎందరు అర్హత సాధించారంటే..!

  • Publish Date - April 13, 2024 / 10:59 AM IST

Group-1 results : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ప్రకటించింది. మార్చి 27న ప్రిలిమ్స్‌ నిర్వహించిన APPSC.. రికార్డు స్థాయిలోనే 27 రోజుల్లో ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్-1 మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్ల నుంచి మొత్తం 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఫలితాల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రతించాలని సూచించింది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 81 గ్రూప్‌-1 పోస్టులన భర్తీ చేసేందుకు గత ఏడాది డిసెంబర్‌ 8న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసంది. ఆ నోటిఫికేషన్‌ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌ 2 నుంచి 9 తేదీల మధ్య మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉందని ప్రెస్‌ నోట్‌లో ఏపీపీఎస్సీ పేర్కొంది. మొత్తల ఖాళీల్లో ఏపీ సివిల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9, ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులు 18, డీఎస్పీ (సివిల్‌) 26 ఉన్నాయి.

మిగిలిన వాటిలో రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ 6, కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 2, జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌, జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నారు.

Latest News