NEET Exam | దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG-2024 పరీక్ష ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్కార్డులను ఇప్పటికే విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. పరీక్ష నిర్వహణకు కూడా సర్వం సిద్ధం చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్కార్డుతోపాటు, ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును, ఫోటోలను తీసుకొని హాజరుకావాల్సి ఉంటుంది.
NEET Exam : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG-2024 పరీక్ష ఇవాళ మధ్యాహ్నం జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్కార్డులను ఇప్పటికే విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. పరీక్ష నిర్వహణకు కూడా సర్వం సిద్ధం చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్కార్డుతోపాటు, ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును, ఫోటోలను తీసుకొని హాజరుకావాల్సి ఉంటుంది.
ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోసం కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు..