చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులో చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్*2019లో శ్రీహరికోటలోని షార్ నుంచి చంద్రయాన్–2 ప్రయోగంఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను మోసుకెళ్లిన మిషన్చంద్రుడిపై దిగే క్రమంలో దాని ఉపరితలాన్ని ఢీకొన్న ల్యాండర్, రోవర్జాబిల్లి కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇప్పటికీ చిత్రాలను పంపుతున్న ఆర్బిటర్ప్రయోగానికి రెండేళ్లు పూర్తవడంతో నాటి జ్ఞాపకాల తడిలో ఇస్రో శాస్త్రవేత్తలు*బెంగళూరులో లూనార్ సైన్స్ వర్క్షాప్–2021విధాత,సూళ్లూరుపేట: చందమామ రహస్యాలు, గుట్టుమట్లను విప్పడమే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–2ను ప్రయోగించి రెండేళ్లు పూర్తయ్యాయి. 2019లో […]
చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులో చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్*
2019లో శ్రీహరికోటలోని షార్ నుంచి చంద్రయాన్–2 ప్రయోగం
ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను మోసుకెళ్లిన మిషన్
చంద్రుడిపై దిగే క్రమంలో దాని ఉపరితలాన్ని ఢీకొన్న ల్యాండర్, రోవర్
జాబిల్లి కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇప్పటికీ చిత్రాలను పంపుతున్న ఆర్బిటర్
ప్రయోగానికి రెండేళ్లు పూర్తవడంతో నాటి జ్ఞాపకాల తడిలో ఇస్రో శాస్త్రవేత్తలు*
బెంగళూరులో లూనార్ సైన్స్ వర్క్షాప్–2021
విధాత,సూళ్లూరుపేట: చందమామ రహస్యాలు, గుట్టుమట్లను విప్పడమే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్–2ను ప్రయోగించి రెండేళ్లు పూర్తయ్యాయి. 2019లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పే స్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్ –2ను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు బెంగళూరులో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చంద్ర యాన్–2లో భాగంగా మొదట ఉపగ్ర హాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి చంద్రుడి వైపు సుమారు కోటి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్య సమీపానికి చేరుకుంది. సెప్టెంబర్ 6న ఆర్బిటర్ చం ద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జాబిల్లి ర హస్యాలను తెలుసుకోవడానికి వీలుగా మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ల ను అమర్చి పంపారు. శాటిలైట్.. ఆర్బి టర్, ల్యాండర్, రోవర్లను చంద్రుడిపై సురక్షితంగా జారవిడిచింది. అయితే చి వరి రెండు నిమిషాల్లో ఆందోళన నెల కొంది.
ల్యాండర్ చంద్రుడిపై దిగే క్రమం లో దాని ఉపరితలాన్ని ఢీకొనడంతో రో వర్ కనిపించకుండా పోయింది. దీంతో ల్యాండర్, రోవర్ల నుంచి సంకేతాలు ని లిచిపోయాయి. ఇస్రో శాస్త్రవేత్తలు వివి ధ దేశాల సాయం తీసుకున్నప్పటికీ ఫలి తం లేకుండా పోయింది. అయితే ఆర్బి టర్ మాత్రం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమి స్తోంది. జాబిల్లిపై పలు పరిశోధనలు చే స్తూ ఛాయాచిత్రాలను అందించడంలో విజయవంతంగా పనిచేస్తోంది. ఇప్పటి వరకు ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు పరిభ్రమించి అద్భుతమైన సమా చారాన్ని భూమికి చేరవేసింది. చంద్రుడి పై తేమ ఉనికి.. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్య లోకి వెళ్లి రెండేళ్లు పూర్తయిన సందర్భం గా ఇస్రో రెండు రోజులపాటు బెంగళూ రులో లూనార్ సైన్స్ వర్క్షాప్ను నిర్వ హిస్తోంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం మాట్లాడు తూ.. చంద్రయాన్–2లో ఐదు ఉపకర ణాలు ఇప్పటికీ విజయవంతంగా పని చేస్తున్నాయన్నారు. ఈ రెండేళ్లలో ఆర్బి టర్ పంపిన సమాచారాన్ని మీడియాకు వివరించారు. కొన్ని రోజుల క్రితం చంద్రు డి ఉపరితలంపై హైడ్రాక్సిల్ నీటి అణు వులను ఆర్బిటర్ కనుగొందన్నారు. ఈ సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చే స్తున్నామని చెప్పారు. చంద్రుడిపై తేమ ఉనికి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంద న్నారు. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో విజ యవంతంగా పరిభ్రమిస్తూ ఎప్పటి క ప్పుడు డేటాను ఇస్తోందని తెలిపారు.
ఆర్బిటర్తోపాటు ఐదు పేలోడ్స్.. వాటి పనులివే.. చంద్రయాన్–2లో ప్రయో గించిన ఆర్బిటర్ బరువు 2,379 కిలో లు. దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లి మిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసింది. ఆర్బిటర్.. చంద్రుడికి వంద కిలో మీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమి స్తుంది. ఇం దులో అమర్చిన లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎ క్స్రే స్పెక్ట్రోమీటర్.. చంద్రుడి ఉపరి తలంపై ప్రధాన మూలకాలను మ్యా పింగ్ చేస్తుంది. ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్.. చంద్రుడిపై నీరు, మంచు వంటి వాటి ఉనికిని శోధి స్తుంది. ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్.. చంద్రుడిపై ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని అందజేస్తుంది. టెరియన్ మ్యాపింగ్ కెమెరా.. చంద్రు డిపై ఖనిజాల అధ్యయనానికి అవసర మైన త్రీడీ మ్యాప్లను తయారు చేయ డానికి ఉపయోగపడుతుంది. కొనసా గింపుగా చంద్రయాన్–2 అతి తక్కువ ఖర్చుతో ఇస్రో 2008లో తొలిసారిగా చంద్రయాన్–1 ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి కక్ష్యలో ఉపగ్రహాన్ని తిప్పి పరిశోధనలు చేసింది. చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్ల పా టు పనిచేసేలా రూపొందించగా సాంకే తిక లోపంతో పది నెలలు మాత్రమే పని చేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణు వుల జాడ ఉందని గుర్తించి చరిత్ర సృ ష్టించింది. దీనికి కొనసాగింపుగా చంద్ర యాన్–2ను ప్రయోగించారు.