ఏసీబీకి చిక్కిన శామీర్ పేట్ తహశీల్ధార్

భూమి వివాదం పరిష్కారం కోసం రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ శామీర్‌పేట్ తహశీల్దార్ సుచరితను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | May 26, 2026, 4:13 pm IST
Read Time: 2 mins
ఏసీబీకి చిక్కిన శామీర్ పేట్ తహశీల్ధార్

తెలంగాణలో ఏసీబీ దూకుడు కొనసాగుతుంది. తాజాగా రూ.100కోట్ల చొప్పున అక్రమాస్తులు ఆర్జించిన ఇద్దరు అధికారులకు చెక్ పెట్టిన ఏసీబీ వరుస దాడులతో దూసుకపోతుంది. మంగళవారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు.

రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ తహశీల్ధార్ సుచరిత ఏసీబీకి చిక్కారు. భూముల వివాదాన్ని క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ పథకం మేరకు దాడులు నిర్వహించి అవినీతి తహశీల్ధార్ ఆటకట్టించింది.

ఇవి కూడా చదవండి :

గవర్నర్‌ను కలిసిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
ఢిల్లీకి చేరిన కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం మార్పు లొల్లి !