Cancer | హానికారక రసయనాలతో కలుషితమైన నీటిని తాగడంతో ఓ యువకుడు వృషణాల బారినపడ్డాడు. దీంతో సదరు యువకుడు నీటి కాలుష్యానికి కారణమైన ఆయా కంపెనీలను కోర్టుకు లాగాడు. ఈ ఘటన అమెరికాలోని ఓహియో రాష్ట్రంలోని ఏంగిలే ఉడ్ నగరంలో చోటు చేసుకున్నది. 29 సంవత్సరాల యువకుడు ఆరా అడ్కిన్స్ పాలీఫ్లోరోఆల్కైల్ రసాయనాలను (PFAS) వాడే రెండు డజన్లకుపైగా కంపెనీల కారణంగా తాను తాగే తాగునీరు కలుషితమైనంది ఆరోపించారు. 3ఎం, డూపాంట్ సంస్థలే దీనికి ప్రధానకారణమని పిటిషన్లో ఆరోపించాడు. సాధారణంగా మంటలను ఆర్పేందుకు వినియోగించే ఆక్వియ్ ఫిల్మ్ ఫార్మింగ్ ఫోమ్ తయారీలో పీఎఫ్ఏ రసాయనాలను వినియోగిస్తుంటారు. ఇప్పటికే అమెరికాకు చెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ నీటి కాలుష్యంపై దృష్టి సారించింది. తాగునీటిలో పీఎఫ్ఏ రసాయనాల స్థాయులను నిర్దేశిస్తూ మార్గదర్శకాలను సైతం జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఆరాన్ అడ్కిన్స్ కేసుకు ప్రాధాన్యం సంతరించుకున్నది. కొద్ది సంవత్సరాల పాటు పీఎఫ్ఏ రసాయనాల కారణంగా నీరంతా కలుషితమైందని.. ఆ నీటిని తాగడంతో క్యాన్సర్ బారినపడ్డట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో బయటపడింది. మరోవైపు, ఆరాన్ భార్య సైతం కోర్టును ఆశ్రయించింది. తన భర్త క్యాన్సర్ కారణంగా తాను నరకం అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. జీవిత భాగస్వామి సాంగత్యానికి దూరమయ్యానని.. చివరకు తన వివాహ బంధంపై ప్రతికూల ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చింది. నీటి కాలుష్యానికి బాధ్యులైన కంపెనీలు పరిహారం చెల్లించాలని దంపతులు కోరారు. నీటిలోని ఫ్లోరో రసాయన ఉత్పత్తుల కారణంగా జరిగే నష్టాలపై కంపెనీలు హెచ్చరించలేదని ఆరోపించారు. అయితే, అగ్నిమాపక రసాయనాలతో పాటు నాన్స్టిక్ కుక్ వేర్ ఇతర రసాయనాల్లోనూ పీఎఫ్ఏఎస్ ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కెమికల్స్ చాలా ఏళ్ల పాటు అలాగే ఉండిపోతాయని, అధిక మోతాదుల్లో వీటి బారిన పడేవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.