Srinivas Goud | రేప్ కేసులో ఉన్న వాళ్ళను వెంట తిప్పుకోవడం కాంగ్రెస్కు అలవాటు : శ్రీనివాస్ గౌడ్
తన జీవితం మొత్తం కేసీఆర్ తోనే ఉంటానని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానని, వారిపై పదికోట్లకు పరువునష్టం దావా వేస్తామన్నారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతో దిగజారి నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని మాజి మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. నవీన్ యాదవ్ కు తాను మద్దతు తెలిపినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారన్నారు. అసలు కాంగ్రెస్ అభ్యర్ధి తనతో ఎప్పుడు ఫోటో దిగారో, ఎప్పుడు మాట్లాడారో తెలియదని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తాను ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ తో ఉన్నానని చెప్పారు. ‘నా తండ్రి తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ కోసం ఉద్యోగాన్ని వదులుకుని వచ్చాను. ఉద్యోగంలో ఉండి జైలుకి వెళ్ళాను. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నా తమ్ముడిని 40 రోజులు జైల్లో పెట్టారు. నేను ఒకే పార్టీలో ఉన్నాను, ఎమ్మెల్యేగా,మంత్రిగా పనిచేశాను. నా క్యారెక్టర్ ను దెబ్బతీస్తున్నారు. గెలవడం చేతకాకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు’ అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
తన జీవితం మొత్తం కేసీఆర్ తోనే ఉంటానని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానని, వారిపై పదికోట్లకు పరువునష్టం దావా వేస్తామన్నారు. ఏ బుక్ లేదన్న డీజీపీ ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదు.. కాంగ్రెస్ వాళ్ళను మాత్రమే డీజీపీ కాపాడుతారా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. సెటిల్ మెంట్లు చేసిన వాళ్ళను, రేప్ కేసులో ఉన్న వాళ్ళను వెంట తిప్పుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటు అని అన్నారు.
జూబ్లీహిల్స్ మాగంటి సునీత గెలుస్తుందనే భయంతోనే కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తున్నదని తెలిపారు. కేసీఆర్ చేసినట్లు బీసీలకు ఎవరూ మేలు చేయలేదని శ్రీనివాస్ గౌడ్ కొనియడారు. ‘మీలాగా మేము చెట్టు కొమ్మను నరుక్కోము. కాంగ్రెస్ అఫీషియల్ ఫేస్ బుక్ లో నాపై పోస్టు పెట్టారు మీకు సిగ్గు ఉందా?. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను జీవితాలతో ఆటలు ఆడవద్దు. మా కుటుంబ సభ్యులను వేధించినా మేము భయపడలేదు. పార్టీ మారితే కేసులు ఎత్తివేస్తామన్నా పార్టీ మారలేదు’ అని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram