Site icon vidhaatha

అమృత్‌సర్ స్వ‌ర్ణ దేవాల‌యంలో చోరీ


విధాత‌: పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని ప్ర‌ఖ్యాత గోల్డెన్ టెంపుల్‌లో చోరీ జ‌రిగింది. గురుపురాబ్ (గురునానక్ జయంతి)కి ఒక రోజు ముందు స్వ‌ర్ణ‌దేవాల‌యం విరాళాల కౌంట‌ర్ నుంచి లక్ష రూపాయలు ఎత్తుకెళ్లారు. ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు సందర్శించే పవిత్ర క్షేత్రంలో దొంగతనం జరగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. సీసీటీవీ వీడియోల సాయంతో ఉద్యోగులు చోరీ విష‌యాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు.

ఆదివారం సాయంత్రం న‌లుగురు వ్య‌క్తులు దేవాల‌యాన్ని సందర్శించారు. త‌మ ల‌క్ష రూపాయలు దొంగ‌లు కొట్టేశార‌ని ఆరోపిస్తూ శ్రీ హర్‌మందిర్ సాహిబ్ గురుద్వారా (గోల్డెన్ టెంపుల్‌గా ప్రసిద్ధి చెందింది) విరాళాల కౌంటర్ ప్రాంగణాన్ని ఆ వ్యక్తులు సందర్శించారు. ఆ న‌లుగురు ల‌క్ష చోరీ చేసి ఉండ‌వ‌చ్చ‌ని సిబ్బంది అనుమానించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆల‌యంలో నిర్వహించే అర్దాలు, లంగర్లు, కల్యాణ కార్యక్రమాల కోసం భక్తులు కానుక‌లు, డ‌బ్బులు హుండీలో వేస్తుంటారు. అలా డిపాజిట్ చేసిన సొమ్ముతో ఆ న‌లుగురు పరారైనట్టు అనుమానిస్తున్నారు.

Exit mobile version