విధాత, ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికం సేవలు మన దేశంలోనూ మొదలయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
రెండేళ్లలో దేశమంతటా 5 జీ సేవలు విస్తరించనున్నారు. ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడా ఈ సేవలు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి. 5జీ సేవలు ప్రారంభించడానికి ముందు.. టెలికాం సంస్థల స్టాళ్లను మోదీ పరిశీలించారు.

అక్కడి స్టాళ్లలో కలియతిరిగారు. జియో, ఎయిర్టెల్ సహా పలు సంస్థల 5జీ ఉత్పత్తులను వీక్షించారు. ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మోదీకి వివరించారు. ప్రత్యేక కళ్లద్దాలు ధరించి వీడియోలు వీక్షించారు. ఓ స్టాల్లో వీడియో గేమ్ సైతం ఆడారు.
Latest News
అక్రిడిటేషన్లు మరో రెండు నెలలు పొడిగింపు
టెలికం సేవల్లో కొత్త విప్లవం.. 6జీ సేవల దిశగా కీలక అడుగు.. మొబైల్ మార్చుకోవాలా?
మలయాళీ సూపర్ స్టార్ మోహన్లాల్ ఇంట్లో విషాదం..
ఫోర్త్ సిటీ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే డీపీఆర్ కోసం టెండర్లు
కమల్ నుండి గౌతమి విడిపోవడానికి కారణం ఏంటి..
తుపాకులతో బెదిరించి రూ.10 కోట్ల ఆభరణాల చోరీ!
ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ
సంక్రాంతికి ఆ రూట్ లో టోల్ చార్జీల రద్దు
ప్రియాంక వాధ్రా కొడుకు రైహాన్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?
ఇండియాను మిస్ అవుతా.. అమెరికా పర్యాటకుడి భావోద్వేగం