విధాత, ఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా నాలుగో పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్న 5జీ టెలికం సేవలు మన దేశంలోనూ మొదలయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలిదశలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, చండీగఢ్, గాంధీనగర్, గురుగ్రాం, లక్నోలో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
రెండేళ్లలో దేశమంతటా 5 జీ సేవలు విస్తరించనున్నారు. ఇప్పటికే అమెరికా, చైనా, దక్షిణ కొరియా, ఐరోపాలోని కొన్ని దేశాల్లో 5జీ అందుబాటులోకి వచ్చింది. అక్కడా ఈ సేవలు కొన్ని నగరాల్లోనే ఉన్నాయి. 5జీ సేవలు ప్రారంభించడానికి ముందు.. టెలికాం సంస్థల స్టాళ్లను మోదీ పరిశీలించారు.

అక్కడి స్టాళ్లలో కలియతిరిగారు. జియో, ఎయిర్టెల్ సహా పలు సంస్థల 5జీ ఉత్పత్తులను వీక్షించారు. ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మోదీకి వివరించారు. ప్రత్యేక కళ్లద్దాలు ధరించి వీడియోలు వీక్షించారు. ఓ స్టాల్లో వీడియో గేమ్ సైతం ఆడారు.
Latest News
షాకింగ్.. కుక్కలా ప్రవర్తిస్తున్న యువకుడు.. భయాందోళనలో స్థానికులు
మార్చి 24న ఢిల్లీలో సీపీఎం ధర్నా
ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ..
మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి..క్యాతనపల్లిలో హై టెన్షన్
అందాలతో కుమ్మేసిన విష్ణుప్రియ.. మరీ ఇంత అరాచకం ఏంటి!
నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్దార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురు
వాయిదా పడిన 11 మున్సిపాల్టీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నేడే
తగ్గిన బంగారం, వెండి ధరలు !
భుజం సర్జరీపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..
విజయ్పై విమర్శల క్రమంలో త్రిష పేరును లాగిన బీజేపీ నేత…