Asifabad | మరి కొద్ది గంటల్లోనే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతుండగా, గుండెపోటుకు బలయ్యాడు ఓ బాలుడు. అతని చేత్తో కేక్ కట్ చేయించి, అంత్యక్రియలు నిర్వహించారు. కొడుకు మరణాన్ని తలచుకొని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి.
వివరాల్లోకి వెళ్తే.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బాబాపూర్కు చెందిన గుణవంత్ రావు, లలిత దంపతులకు ముగ్గురు కుమారులు. మూడో కుమారుడు సచిన్(16) పుట్టిన రోజు శుక్రవారం కావడంతో గురువారం ఆసిఫాబాద్కు షాపింగ్కు వెళ్లాడు.
షాపింగ్ చేస్తుండగానే ఛాతీలో నొప్పి రావడంతో తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో హుటాహుటిన అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు.
దీంతో కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు శుక్రవారం రోజు అతని చేయి పట్టుకుని కేక్ కట్ చేయించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
Asifabad | పుట్టిన రోజు నాడే.. గుండెపోటుతో బాలుడు మృతి! మృతదేహాంతోనే కేక్ కటింగ్ | Vidhaatha | Latest Telugu Newshttps://t.co/xdCb2MvGYq#telangana #telugu #telugunews #Devara Telugu #2000Note pic.twitter.com/HNrsSAcqIT
— vidhaathanews (@vidhaathanews) May 20, 2023