కేసీఆర్ పేరుపై మట్టి పూసిన వ్యక్తిపై కేసు నమోదు
జ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం ప్రజా దర్బార్ సందర్భంగా శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరుపై మట్టి పూసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
విధాత: జ్యోతిబా పూలే ప్రజా భవన్లో శుక్రవారం ప్రజా దర్బార్ సందర్భంగా శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరుపై మట్టి పూసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన యూత్ కాంగ్రెస్ నాయకులు రాజేష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న ప్రజాభవన్ లో తొలిసారి ప్రజా దర్బార్ నిర్వహించారు.
In the video Congress leader seen smudging mud covering Shri KCR garu’s name on the plaque of Chief Minister’s Camp Office… pic.twitter.com/19pAOXdQn0
— Krishank (@Krishank_BRS) December 8, 2023
ఈ క్రమంలో ప్రజాభవన్కు వెళ్లిన రాజేశ్ రెడ్డి ప్రజాభవన్ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ శిలాఫలకంపై ఉన్న కేసీఆర్ పేరుపై మట్టి పూశాడు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా బీఆరెస్ ఈ చర్యను ఖండించింది. పోలీసులు దీనిపై స్పందించి ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram