Site icon vidhaatha

AP GOVT | 90 రోజుల్లో ఏపీ ప్ర‌భుత్వం రూ.27వేల కోట్ల అప్పు

AP GOVT

విధాత‌: అప్పు చేసి ప‌ప్పుకూడు తిన్న‌ట్లే ఉంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిస్థితి. ఈ మూడు నెల‌ల్లో అంటే 90 రోజుల్లోనే దాదాపు రూ.27 వేల 500 కోట్లు అప్పు చేసింది. ఇది రికార్డు బ్రేక్ అంటున్నారు. తాజాగా మరో రెండు వేల కోట్లను ఏపీ సర్కార్ అప్పుగా తీసుకొంది.

మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్లను వేలం వేసిన సర్కార్.. రెండు వేల కోట్లను అప్పుగా తీసుకుంది. వెయ్యి కోట్లు 18 సంవత్సరాలకు 7.43 శాతం వడ్డీ, మరో వెయ్యి కోట్లు 19 సంవత్సరాలకు 7.43 శాతం వడ్డీకి రుణం పొందింది. ఈ రెండు వేల కోట్లతో నేటికి రూ.27 వేల 500 కోట్లు ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎంలో ఏపీ తీసుకొచ్చింది.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఎఫ్‌ఆర్‌బీఎంలో ఇక మిగిలింది రూ. 3 వేల కోట్లు మాత్రమే. ఇప్పటికే విద్యుత్ సంస్కరణలు వేగంగా అమలు చేస్తున్నందుకు ఏపీ సర్కార్‌కు మరో 9 వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

Exit mobile version