Janasena | జనసేనకే గ్లాసు గుర్తు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో గొప్ప ఊరట దక్కింది. ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది

  • Publish Date - April 16, 2024 / 02:38 PM IST

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో గొప్ప ఊరట దక్కింది. ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్ధించింది. హైకోర్టు తీర్పుతో ఎన్నికల చిహ్నంకు సంబంధించి జనసేనకు పెద్ద టెన్షన్ తొలగిపోయినట్లయ్యింది.

జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించినందున తాము ఎన్నికల వేళ జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రెండు పిటిషన్లను తిరస్కరించింది.

Latest News