ఇటీవల వరుస దాడులతో దూకుడు మీదున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం పలు జిల్లాల్లో ముగ్గురు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం విశేషం
విధాత : ఇటీవల వరుస దాడులతో దూకుడు మీదున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం పలు జిల్లాల్లో ముగ్గురు అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం విశేషం. అస్పత్రిలో ఫార్మసీ విభాగానికి అనుమతిచ్చేందుకు లంచం డిమాండ్ చేసి, 18వేలు లంచం తీసుకుంటుండగా నల్లగొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ను ఏసీబీ పట్టుకుంది. ఆర్టీసీ డ్రైవర్ శాఖాపరమైన కేసు కొట్టివేసేందుకు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ రూ.20 వేలు లంచం డిమాండ్ చేసి, బాధితుడి నుంచి ఎల్కతుర్తి హోటల్లో ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి పట్టుకుంది. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి 40వేలు డిమాండ్ చేసి 25వేలు లంచం తీసుకుంటుండగా అసిఫాబాద్ ఎస్సై రాజ్యలక్ష్మిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.