Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. ఇచ్ఛాపురం సమీపంలో బాహుదా నదిపై నిర్మించిన బ్రిడ్జి కుప్పకూలిపోయింది. రాళ్ల లోడ్తో వెళ్తున్న లారీ బ్రిడ్జి ప్రారంభంలోకి వెళ్లగానే.. ఆ వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ట్రాఫిక్ను మళ్లించారు. అయితే బ్రిడ్జి కూలిన సమయంలో అటు వైపు వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ బ్రిడ్జిని బ్రిటీష్ కాలంలో నిర్మించారు. […]
Andhra Pradesh |
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. ఇచ్ఛాపురం సమీపంలో బాహుదా నదిపై నిర్మించిన బ్రిడ్జి కుప్పకూలిపోయింది. రాళ్ల లోడ్తో వెళ్తున్న లారీ బ్రిడ్జి ప్రారంభంలోకి వెళ్లగానే.. ఆ వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ట్రాఫిక్ను మళ్లించారు.
అయితే బ్రిడ్జి కూలిన సమయంలో అటు వైపు వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ బ్రిడ్జిని బ్రిటీష్ కాలంలో నిర్మించారు. లారీ డ్రైవర్, క్లీనర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.