Bellaiah Naik | ఆదివాసీలపై దాడులను కొన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి

Bellaiah Naik విధాత‌: దేశంలో ఆదివాసీలపై దాడులను కొన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని టీపీసీసీ ఎస్టీ సెల్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ ఆరోపించారు. ఆదివాసీలకు మద్దతుగా కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమౌతోంద‌న్నారు. ఈ మేర‌కు మణిపూర్ ఆదివాసీలకు అండగా ఆగ‌ష్టు 3వ‌ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామ‌ని వెల్ల‌డించారు. మణిపూర్ ఘటన‌ తర్వాత దేశంలో ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్ర‌మంలో ఆగస్ట్ 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా ఆదివాసీలకు ధైర్యం ఇచ్చేందుకు […]

  • Publish Date - August 1, 2023 / 12:14 AM IST

Bellaiah Naik

విధాత‌: దేశంలో ఆదివాసీలపై దాడులను కొన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహిస్తున్నాయని టీపీసీసీ ఎస్టీ సెల్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ ఆరోపించారు. ఆదివాసీలకు మద్దతుగా కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమౌతోంద‌న్నారు. ఈ మేర‌కు మణిపూర్ ఆదివాసీలకు అండగా ఆగ‌ష్టు 3వ‌ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామ‌ని వెల్ల‌డించారు. మణిపూర్ ఘటన‌ తర్వాత దేశంలో ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.

ఈ క్ర‌మంలో ఆగస్ట్ 9న ఆదివాసీ దినోత్సవం సంద‌ర్భంగా ఆదివాసీలకు ధైర్యం ఇచ్చేందుకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టబోతోంద‌న్నారు. ఆగస్ట్ 6న ఆదివాసీ తండాల్లో బస చేయాలని నిర్ణయించామ‌ని, 7 న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామ‌ని, 8 న సాయంత్రం కాగడాల ప్రదర్శన చేస్తామ‌ని, 9న ఆదివాసీ కవాతు, ఆదివాసీ మహాసభ నిర్వహిస్తామ‌న్నారు. అలాగే.. వచ్చే నెలలో భారీ బహిరంగ సభ పెట్టి ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తామ‌ని తెలిపారు.

Latest News