BRS 20 సెగ్మెంట్లలో టికెట్ల పంచాయితీ విధాత: స్టేషన్ ఘన్ పూర్, తాండూరు, నకిరేకల్, వరంగల్ తూర్పు, ఆలేరు, వర్ధన్నపేట, వేములవాడ, రామగుండం, చెన్నూరు, ముషీరాబాద్, హుజురాబాద్, మానకొండ వారు, చొప్పదండి, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖైరతాబాద్ ఇలా ఒకటి కాదు రెండు పది నుంచి ఇరవై నియోజకవర్గాల్లో అధికార టీఆర్ఎస్ టికెట్ల కోసం తిరుగు బాట్లు తప్పేలా లేవు. దీనికి కారణం తొమ్మిదేళ్లకు పైగా అవకాశాల కోసం ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురుకావడం, నియోజకవర్గాలు పెరుగుతాయన్న మాటలు […]
BRS
విధాత: స్టేషన్ ఘన్ పూర్, తాండూరు, నకిరేకల్, వరంగల్ తూర్పు, ఆలేరు, వర్ధన్నపేట, వేములవాడ, రామగుండం, చెన్నూరు, ముషీరాబాద్, హుజురాబాద్, మానకొండ వారు, చొప్పదండి, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖైరతాబాద్ ఇలా ఒకటి కాదు రెండు పది నుంచి ఇరవై నియోజకవర్గాల్లో అధికార టీఆర్ఎస్ టికెట్ల కోసం తిరుగు బాట్లు తప్పేలా లేవు.
దీనికి కారణం తొమ్మిదేళ్లకు పైగా అవకాశాల కోసం ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురుకావడం, నియోజకవర్గాలు పెరుగుతాయన్న మాటలు వమ్ము కావడం, కనీసం కార్పొరేషన్ టికెట్లు దక్కకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా రెండుమూడు సార్లు పనిచేసిన వారు ఒకసారి ఓడిపో వడంతో ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని పార్టీలో చేర్చుకోవడం వంటి అనేక అంశాలు అధికారపార్టీలో అసంతృప్తి కి ఆజ్యం పోస్తున్నాయి.
ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడు పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా.. అది నచ్చకున్నా సర్దుకు పోయారు. ధిక్కరించే సాహసం చేయలేదు. పార్టీని వీడే వయత్నాలు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు అలా లేదు. టెకెట్ ఇస్తారా? మమ్మల్ని గుర్తిస్తారా? లేక పార్టీ మారాలా అని అనేకమంది ధిక్కార స్వరాలు వినిపిన స్తున్నారు. వీళ్లందరికీ ఇతర పార్టీల్లో టికెట్ లభిస్తుందా? అన్నది కచ్చితంగా చెప్పలేము. కానీ వారు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారా? అంటే ఔననే అంటున్నారు.
‘మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దు’ అని కొన్ని రోజులుగా అధికారపార్టీలో వ్యక్తమౌతున్న నిరనసలే దీనికి ఉదాహరణ. అందుకే సీఎం కేసీఆర్ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తారని, అవి 80 వరకు ఉండొచ్చు అంటున్నారు. మిగిలిన 20 పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చడం లేదా నేతల మధ్య విభేదాలు ఉన్న స్థానాల ప్రకటించపోవడం చేయొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేతల మధ్య విభేదాలున్న నియోజకవర్గాల్లో ఎవరికి టెకెట్ ఇచ్చినా మరొకరు వ్యతిరేకంగా పనిచేస్తారు. ఉప ఎన్నిక సమయంలో మండలాల వారీగా నేతలను మోహరించే అవకాశం ఉండదు. పైగా కొందరు మంత్రులు కూడా ఈసారి ఓడిపోవచ్చు అనే ప్రచారం జరుగుతున్నది. మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం. కోసం తీవ్రంగా శ్రమిస్తున్న కేసీఆర్ కు సొంతపార్టీ నేతల నుంచే నవాల్ ఎదురవుతున్నది.
ఇది బహుశా బీఆర్ఎస్ అధిష్టానం ఊహించి ఉండదు. ఈ సమస్యల కు తోడు 317 జీవో వల్ల జిల్లాలు దాటిన ఉపాధ్యాయులు, సకాలంలో వేతనాలు అందక ఉద్యోగులు, పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు, ధరణి వల్ల రైతుల్లోనూ చాలా వ్యతిరేకత ఉన్నది. సంక్షేమ పథకాలే తమను గట్టెకిస్తాయి అనుకునేలా పరిస్థితులు లేవు అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కచ్చితంగా గెలిచే స్థానాలు ఎన్ని? మొదట ప్రకటించే స్థానాల కూర్పు వంటి అంశాలపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ.. నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారని సమాచారం. మాకు తిరుగులేదు అన్న వాళ్లే ఇంత చేసిన మా ప్రభుత్వాన్ని కూలగొట్టుకుంటారో అనే స్థాయికి రాజకీయ పరిణామాలు మారిపోయాయి.