CA Exams Postponed: భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీఏకు సంబంధించిన ఇంటర్మీడియట్, పోస్ట్ క్వాలిఫికేషన్స్ కోర్సు పరీక్షలను వాయివా వేస్తున్నట్లుగా ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్ అకౌంటెట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రకంటించింది. మే 9నుంచి 14వరకు జరుగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నామని.. పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఈ ప్రకటనకు సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు ఐసీఏఐ.ఓఆర్జీ వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించింది.
కాగా, షెడ్యూల్ ప్రకారం సీఏ పరీక్షలు మే 2 నుంచి 14 వరకు జరగాల్సి ఉంది. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఏ ఇంటర్ పరీక్ష మే 3, 5, 7 తేదీల్లో, గ్రూప్ 2 పరీక్షలు మే 9, 11, 14 తేదీల్లో జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రూప్ 1 ఫైనల్ ఎగ్జామ్ 2, 4, 6 తేదీల్లో నిర్వహించగా, గ్రూప్ 2 పరీక్ష మే 8, 10, 13 తేదీల్లో జరగాల్సి ఉంది. అనంతరం జరుగనున్న పరీక్షలు ప్రస్తుతం వాయిదా పడ్డాయి.