CM KCR సూర్యాపేట సభలో పరోక్షంగా తేల్చిన సీఎం కేసీఆర్ విధాత : మునుగోడు ఉప ఎన్నికతో మొదలైన కమ్యూనిస్టులతో పోత్తు ప్రస్థానానికి సూర్యాపేట సభతో సీఎం కేసీఆర్ తెరవేశారు. ఆదివారం సీఎం కేసీఆర్ సూర్యాపేట సభలో తన ప్రసంగంలో కమ్యూనిస్టులతో పొత్తు లేదంటూ పరోక్షంగా తేల్చేశారు. ఇందుకు నిదర్శనంగా సభలో సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ తన ప్రసంగంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12అసెంబ్లీ […]
CM KCR
సూర్యాపేట సభలో పరోక్షంగా తేల్చిన సీఎం కేసీఆర్
విధాత : మునుగోడు ఉప ఎన్నికతో మొదలైన కమ్యూనిస్టులతో పోత్తు ప్రస్థానానికి సూర్యాపేట సభతో సీఎం కేసీఆర్ తెరవేశారు. ఆదివారం సీఎం కేసీఆర్ సూర్యాపేట సభలో తన ప్రసంగంలో కమ్యూనిస్టులతో పొత్తు లేదంటూ పరోక్షంగా తేల్చేశారు. ఇందుకు నిదర్శనంగా సభలో సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ తన ప్రసంగంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12అసెంబ్లీ సీట్లకు 12 సీట్లను బీఆరెస్ గెలువాలని చెప్పారు.
అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాల్లో బీఆరెస్ పోటీ చేస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లయ్యింది. దీంతో ఈ జిల్లా నుంచి సీపీఐ, సీపీఎంలు పొత్తులో భాగంగా అడిగిన మునుగోడు, మిర్యాలగూడ సీట్లతో పాటు ఆ పార్టీలతో బీఆరెస్ పొత్తు కథ ముగిసినట్లయ్యిందని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కమ్యూనిస్టులతో పొత్తు లేదన్నట్లుగా ఉండటంతో ఇక తమ సిటింగ్ సీట్లకు డోకా లేదంటూ బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేలు సంబరపడుతున్నారు.
అయితే నేడు సోమవారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ప్రకటించనున్న బీఆరెస్ తొలి జాబితాలో కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించకుండా వారు అడుగుతున్న స్థానాలకు కూడా బీఆరెస్ అభ్యర్థులను ప్రకటిస్తే మాత్రం ఇక పొత్తుల కథకు అధికారికంగా ముగింపు పలికినట్లవుతుంది. అదే జరిగితే కమ్యూనిస్టు పార్టీలను సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక కోసం కూరలో కరివేపాకు మాదిరిగా వాడుకుని తీసిపారేసినట్లేనని, ఇది ఆ పార్టీలకు అవమానకరమన్న భావన కమ్యూనిస్టు శ్రేణుల్లో వినిపిస్తుంది.