CM KCR | 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్‌రన్‌.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

నార్లాపూర్ ఇన్ టేక్ వ‌ద్ద ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌ కృష్ణాన‌దికి ప్ర‌త్యేక పూజ‌లు భారీ బ‌హిరంగ స‌భ‌ 17న‌ కృష్ఱా జ‌లాల‌తో అన్న గ్రామాల్లో దేవ‌త‌ల‌కు పూజ‌లు CM KCR | విధాత‌, హైద‌రాబాద్‌: పాల‌మూరు- రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం వెట్ ర‌న్‌ను ఈనెల 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద సీఎం […]

  • By: Somu    latest    Sep 06, 2023 12:33 AM IST
CM KCR | 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్‌రన్‌.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
  • నార్లాపూర్ ఇన్ టేక్ వ‌ద్ద ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌
  • కృష్ణాన‌దికి ప్ర‌త్యేక పూజ‌లు
  • భారీ బ‌హిరంగ స‌భ‌
  • 17న‌ కృష్ఱా జ‌లాల‌తో అన్న గ్రామాల్లో దేవ‌త‌ల‌కు పూజ‌లు

CM KCR | విధాత‌, హైద‌రాబాద్‌: పాల‌మూరు- రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం వెట్ ర‌న్‌ను ఈనెల 16వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని సీఎం కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద సీఎం కేసీఆర్ స్విచ్ ఆన్ చేసి వెట్ ర‌న్‌ను ప్రారంభించనున్నారు.

ఈ సంద‌ర్భంగా బుధ‌వారం స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన‌ సమీక్షలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, సీఎస్, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈలు తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు.

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రపంచంలోనే భారీ పంపులతో నీటి ఎత్తిపోత‌కు సిద్ద‌మైంద‌ని సీఎం అన్నారు. కృష్ణా న‌దికి 2 కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటిని ఎత్తిపోస్తుంద‌న్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మానికి పాలమూరు రంగారెడ్డి జిల్లాలలోని పల్లె పల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరు కానున్నారు.

కృష్ణా జ‌లాల‌తో దేవుళ్ల‌కు అభిషేకం

ఎత్తి పోత‌ల ప‌థ‌కాల‌కు హాజ‌రైన స‌ర్పంచ్‌లు, ప్ర‌జ‌లు ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకుపోయి ఈనెల 17 న ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో దేవుళ్ళ పాదాలకు అభిషేకం చేయాల‌ని నిర్ణ‌యించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అడ్డంకులు తొలిగి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మన మొక్కులు చెల్లించు కుందామ‌ని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. దక్షిణ తెలంగాణ కు పండుగ రోజని ఆయ‌న అన్నారు. ఎన్నో మొక్కులు మొక్కితే, దైవకృపతో, ఇంజనీర్ల కృషి తో, పాలమూరు ఎత్తిపోతల పథకం అడ్డంకులు అధిగమించి సాకారమైంద‌న్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాల‌న్నారు. పట్టుదలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అంద‌నున్న‌ద‌న్నారు. దీంతో బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.