Congress ఒక్కరికే సీడబ్ల్యూసీ సభ్యుడిగా చాన్స్ ఐదుగురు ప్రత్యేక, శాశ్వత ఆహ్వానితులే తెలంగాణ సీనియర్లకు నిరాశ విధాత: పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదివారం పునర్వవస్థీకరించారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి అవకాశం కల్పించారు. వారిలో ఏపీ నుంచి ఎన్ రఘువీరారెడ్డి ఒక్కరికే సీడబ్ల్యూసీ సభ్యుడిగా చోటు దక్కగా, ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు, వంశీచందర్ రెడ్డి, శాశ్వత ఆహ్వానితులుగా టీ సుబ్బిరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదరం రాజనరసింహలకు […]
Congress
విధాత: పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదివారం పునర్వవస్థీకరించారు. ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరుగురికి అవకాశం కల్పించారు. వారిలో ఏపీ నుంచి ఎన్ రఘువీరారెడ్డి ఒక్కరికే సీడబ్ల్యూసీ సభ్యుడిగా చోటు దక్కగా, ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు, వంశీచందర్ రెడ్డి, శాశ్వత ఆహ్వానితులుగా టీ సుబ్బిరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదరం రాజనరసింహలకు స్థానం దక్కింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కే జానారెడ్డి, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీ హనుమంతరావు వంటి వారు సీడబ్ల్యూసీలో చోటు ఆశించినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది.
సీనియర్.. జూనియర్ల సమ్మేళనం
39 మందితో సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించగా.. 32 మందిని శాశ్వత, 13మందిని ప్రత్యేక ఆహ్వానితులు గా నియమించారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి, ‘జీ 23’ బృందంగా పేరుపడిన వారికి సైతం సీడబ్ల్యూసీలో చోటు దక్కింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రాలతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడిన శశిథరూర్, కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, కమ్యూనికేషన్ల విభాగం ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, యువనేత సచిన్ పైలట్లకు స్థానం కల్పించారు.
వారితో పాటు ఏకే ఆంటోనీ, అంబికా సోని, మీరా కుమార్, దిగ్విజయ్ సింగ్, పీ చిదంబరం, తారిక్ అన్వర్, లాల్ థన్హావాలా, ముకుల్ వాస్నిక్, ఆనంద్ శర్మ, అశోక్రావు చవాన్, అజయ్ మాకెన్, చరణ్ జిత్ సింగ్ చన్నీ, కుమారి సెల్జా, గైఖాంగం, ఎన్ రఘువీరా రెడ్డి, శశి థరూర్, తామ్రధ్వాజ్ సాహు, అభిషేక్ మను సింఘ్వి, సల్మాన్ ఖుర్షీద్, జితేంద్ర సింగ్, రణదీప్ సింగ్ సుర్జేవాలా, దీపక్ బబారియాలకు చోటు కల్పించారు.
The Congress President Shri @kharge has constituted the Congress Working Committee.
Here is the list: pic.twitter.com/dwPdbtxvY5
— Congress (@INCIndia) August 20, 2023
పార్టీ ప్రధాన కార్యదర్శులలో జగదీష్ ఠాకూర్, జీఏ మీర్, అవినాష్ పాండే, దీపా దాస్ మున్షీ, మహేంద్రజీత్ సింగ్ మాలవియా, గౌరవ్ గొగోయ్, కమలేశ్వర్ పటేల్, కేసీ వేణుగోపాల్లకు అవకాశం కల్పించారు. శాశ్వత ఆహ్వానితులుగా వీరప్ప మొయిలీ, హరీష్ రావత్, పవన్ కుమార్ బన్సల్, మోహన్ ప్రకాష్, రమేష్ చెన్నితల, బీకే హరిప్రసాద్, ప్రతిభా సింగ్, మనీష్ తివారీ, తారిక్ హమీద్ కర్రా, దీపేందర్ సింగ్ హుడా, టీ సుబ్బిరామిరెడ్డి, గిరీష్ రాయ చోడంకర్, కే రాజు, మీనాక్షి నటరాజన్, చంద్రకాంత్ హందోరే, పులోదేవి నీతమ్, దామోదర రాజ నరసింహ, సుదీప్ రాయ్ బర్మన్లకు అవకాశం కల్పించారు.
ఇన్చార్జిలలో డాక్టర్ ఏ చెల్లకుమార్, భక్త చరణ్ దాస్, డాక్టర్ అజోయ్ కుమార్, హరీష్ చౌదరి, రాజీవ్ శుక్లా, మాణికం ఠాగూర్, సుఖ్వీందర్ రాంధవా, మాణిక్రావ్ ఠాక్రే, రజనీ పటేల్, కన్హయ్య కుమార్, గురుదీప్ సప్పల్, సచిన్ రావు, దేవేందర్ యాదవ్, మనీష్ చత్ర లను నియమించారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు, పవన్ ఖేరా, గణేష్ గోడియాల్, కొడిక్కునిల్ సురేష్, యశోమతి ఠాకూర్, సుప్రియా శ్రీనతే, ప్రిణితి షిండే, అల్కా లాంబా, వంశీ చంద్ రెడ్డిలకు చోటు కల్పించారు. ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఐవైసీ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు నీరజ్ కుందన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా, సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్జీ దేశాయ్ లకు స్థానం కల్పించారు.