విధాత: కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటినందున ఎమ్మెల్యేలు (Congress MLAs) అందరూ బెంగళూరు చేరుకోవాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ 120 మార్కును దాటడం ఖాయమని సిద్ధరామయ్య అన్నారు.
పార్టీ తన ఎమ్మెల్యేలను క్యాంపుల్లో ఉంచడానికి అనేక రిసార్ట్లను బుక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్ “తన ఎమ్మెల్యేలను కూడా విశ్వసించదు” అని ఆరోపించింది.