మరోసారి ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌..అమీర్ అలీఖాన్‌ల సిఫారసు

మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్‌ను, అమీర్ అలీఖాన్ పేర్లను ఖరారు చేస్తూ తెలంగాణ క్యాబినెట్ తీర్మాణం చేసింది

  • Publish Date - March 12, 2024 / 10:58 AM IST

తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

విధాత, హైదరాబాద్‌ : మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్‌ను, అమీర్ అలీఖాన్ పేర్లను ఖరారు చేస్తూ తెలంగాణ క్యాబినెట్ తీర్మాణం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో వీరి నియామకంపై చర్చించి మరోసారి వారి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేస్తు తీర్మానం చేసింది. హైకోర్టు ఆదేశాలతో మరోసారి కోదండరామ్‌, అలీఖాన్‌ల పేర్లను గవర్నర్‌కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతంలో వారిద్దరి పేర్లను రేవంత్ ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు చేయడం, గవర్నర్ ఆమోదం లభించడం జరిగింది. అయితే గత బీఆరెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణల పేర్లను సిఫారసు చేయడం, గవర్నర్ తిరస్కరించడం జరిగింది. దీనిని సవాల్ చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో గవర్నర్ క్యాబినెట్ సిఫారసులను తిరస్కరించకుండా తిప్పి పంపించాలని, క్యాబినెట్ సిఫారసులను ఆమోదించాలని స్పష్టం చేసిన హైకోర్టు, కోదండరామ్‌, అమీర్ అలిఖాన్‌ల నియకామాలను రద్దు చేసింది. మళ్లీ కొత్తగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియాకమ ప్రక్రియ చేపట్టాలని సూచించడంతో ప్రభుత్వం మరోసారి వారి పేర్లను గవర్నర్‌కు పంపుతూ తీర్మానం చేసింది.

Latest News