సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో భారీ చేరికలు
విధాత, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీఆరెస్ నేతలు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థులు కడియం కావ్య, రంజిత్ రెడ్డిల ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి వారిని రేవంత్రెడ్డి ఆహ్వానించారు. మహబూబ్ నగర్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీఆరెస్ నేతలు పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావుల ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram