Congress | టికెట్ల కేటాయింపులో యాదవులకు ప్రాముఖ్యత ఇవ్వాలి: యాదవ విద్యావంతుల వేదిక

Congress యాదవ యుద్దభేరీకి రేవంత్‌కు ఆహ్వానం విధాత: యాదవులకు రానున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నామని, అలాగే యాదవ యుద్దభేరి సభకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఆహ్వానించామని యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు యాదవ్ లు వెల్లడించారు. రాష్ట్రంలో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు 22ఎమ్మెల్యే, 7ఎమ్మెల్సీ, 3లోకసభ, 2 రాజ్యసభ టికెట్లు ఇవ్వాలనే నినాదంతో 25వతారీఖున నిర్వహించబోయే […]

  • Publish Date - August 12, 2023 / 12:42 AM IST

Congress

  • యాదవ యుద్దభేరీకి రేవంత్‌కు ఆహ్వానం

విధాత: యాదవులకు రానున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నామని, అలాగే యాదవ యుద్దభేరి సభకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఆహ్వానించామని యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు యాదవ్ లు వెల్లడించారు.

రాష్ట్రంలో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు 22ఎమ్మెల్యే, 7ఎమ్మెల్సీ, 3లోకసభ, 2 రాజ్యసభ టికెట్లు ఇవ్వాలనే నినాదంతో 25వతారీఖున నిర్వహించబోయే యాదవ యుద్ద భేరి సభకు రేవంత్ రెడ్డిని ఆహ్వానించామన్నారు. యాదవులకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనివ్వడం లేదన్నారు.

కాంగ్రెస్ పారీ్ ఈ దిశగా టికెట్లను కేటాయించి, యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్‌లో 18శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. హక్కులు, డిమాండ్ల సాధనకు యాదవ సోదరులందరు సమిష్టిగా ముందుకు సాగాలన్నారు. రాజ్యాధికారం సాధించెంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ఆహ్వాన కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నేషనల్ జనరల్ సెక్రెటరీ ఆర్.లక్ష్మణ్ యాదవ్, టిపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర జంగయ్య యాదవ్, జనరల్ సెక్రెటరీ బీర్ల ఐలయ్య యాదవ్, గజ్జి బాస్కర్‌ యాదవ్, తాండ్ర శ్రీనివాస్ యాదవ్, రఘురాం యాదవ్, మంజులత యాదవ్, లలితకుమారి యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక ముఖ్య నాయకులు పాల్గొన్నారు.