Dasyam Vinay Bhasker | అక్రమణదారే ఆరోపణలు చేయడం అన్యాయం: చీఫ్ విప్ దాస్యం

Dasyam Vinay Bhasker | కోర్టులో వాంగ్మూలం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నాలాపై అక్రమ కట్టడాలు కట్టిన వారే ఆరోపణలు చేయడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. పరువు నష్టం దావా కేసులో భాగంగా హన్మకొండ జిల్లా కోర్టుకు బుధవారం ఆయన హాజరై, వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ హన్మకొండ నాయింనగర్ లోని పెద్ద […]

  • Publish Date - September 20, 2023 / 01:16 PM IST

Dasyam Vinay Bhasker |

  • కోర్టులో వాంగ్మూలం
  • ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నాలాపై అక్రమ కట్టడాలు కట్టిన వారే ఆరోపణలు చేయడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. పరువు నష్టం దావా కేసులో భాగంగా హన్మకొండ జిల్లా కోర్టుకు బుధవారం ఆయన హాజరై, వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ హన్మకొండ నాయింనగర్ లోని పెద్ద నాలాపై చైతన్య డిగ్రీ కళాశాల యాజమాన్యం అక్రమ నిర్మాణం చేసిందన్నారు.

2016 సెప్టెంబర్ లో భారీ వర్షాల కారణంగా ఈ అక్రమ నిర్మాణాలతో నీరంతా నయీమ్ నగర్ లోతట్టు ప్రాంతాల ఇళ్లలో చేరాయన్నారు. కళాశాల యజమానులు నాలాలపైన అక్రమ నిర్మాణాలు కట్టడం వల్ల పక్కనే ఉన్న ఇండ్లలోకి మురుగునీరు చేరి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్ నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి, నీరు నాలాల గుండా ప్రవహించే విధంగా చూడాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఆదేశించారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా అధికారులు అందరితో కలిసి నాలాల పర్యవేక్షణకు వెళ్లామని చెప్పారు. ఆ సమయంలో చైతన్య డిగ్రీ కాలేజ్ యజమాని పురుషోత్తం రెడ్డి ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, తనపై దుర్భాషలాడారని అన్నారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకంతో ఈ తప్పుడు ఆరోపణలపై పురుషోత్తం రెడ్డి పై బుధవారం పరువు నష్టం దావా వేశానని చెప్పారు.

హన్మకొండ జిల్లా కోర్టులో జడ్జికి సాక్ష్యాధారాలు అందించానని చెప్పారు. అక్టోబర్ 3న మళ్లీ కోర్టుకి హాజరుకావాలని జడ్జి సూచించారని చెప్పారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారే ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. ప్రజల కోసం పోరాడే తనను మాటలు అనడం భావ్యం కాదని అన్నారు.