Delhi | జీ-20 స‌మ్మిట్‌కు ఢిల్లీ ముస్తాబు

ఫౌంటైన్లు, శిల్పాలు ఏర్పాటు చారిత్ర‌క భ‌వ‌నాల వ‌ద్ద ప్ర‌ద‌ర్శ‌న‌లు Delhi | విధాత‌: జీ-20 స‌మ్మిట్‌కు ఢిల్లీ ముస్తాబైంది. దేశ రాజ‌ధానిలో ఈ నెల 9, 10 తేదీల్లో ఈ స‌మావేశం జ‌రుగ‌నున్న‌ది. స‌మ్మిట్‌కు 20 దేశాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌రు కానున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌క‌ల ఏర్పాట్లు చేసింది. ఢిల్లీని స‌రికొత్త‌గా ముస్తాబు చేసింది. వాట‌ర్ ఫౌంటైన్లు, శిల్పాలు, మొక్కలు ఢిల్లీ వ్యాప్తంగా ఏర్పాటుచేశారు. చారిత్ర‌క భవనాలపై నేపథ్య కుడ్య చిత్రాలు కూడా ప్రదర్శించారు. […]

  • Publish Date - September 4, 2023 / 11:43 PM IST

  • ఫౌంటైన్లు, శిల్పాలు ఏర్పాటు
  • చారిత్ర‌క భ‌వ‌నాల వ‌ద్ద ప్ర‌ద‌ర్శ‌న‌లు

Delhi | విధాత‌: జీ-20 స‌మ్మిట్‌కు ఢిల్లీ ముస్తాబైంది. దేశ రాజ‌ధానిలో ఈ నెల 9, 10 తేదీల్లో ఈ స‌మావేశం జ‌రుగ‌నున్న‌ది. స‌మ్మిట్‌కు 20 దేశాల నుంచి ప్ర‌తినిధులు హాజ‌రు కానున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌క‌ల ఏర్పాట్లు చేసింది. ఢిల్లీని స‌రికొత్త‌గా ముస్తాబు చేసింది. వాట‌ర్ ఫౌంటైన్లు, శిల్పాలు, మొక్కలు ఢిల్లీ వ్యాప్తంగా ఏర్పాటుచేశారు. చారిత్ర‌క భవనాలపై నేపథ్య కుడ్య చిత్రాలు కూడా ప్రదర్శించారు.

ఢిల్లీ అంత‌టా భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. అడుగ‌డుగున సీసీటీవీ కెమెరాల‌ను ఏర్పాటుచేశారు. చీమ చిటుక్కుమ‌న్నా తెలిసేలా 1.20 ల‌క్ష‌ల‌కుపైగా సీసీటీవీ కెమెరాల‌ను అధికారులు బిగించారు. ప్ర‌ఖ్యాత భ‌వ‌నాల‌ను అందంగా ముస్తాబు చేశారు. రంగుల విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు. ఎక్క‌డా ఎలాంటి మురుగు క‌నిపించ‌కుండా ర‌హ‌దారుల‌ను అందంగా తీర్చిదిద్దారు. జీ-20 స‌మ్మిట్ లోగోల‌ను నగ‌రంలోని ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఏర్పాటు చేశారు.

Latest News