విధాత, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్లు జోరుగా సాగుతున్నాయి. బుధవారం మాజీ ఐపీఎస్ అధికారి, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ, హిందుపూరం కీలక నేత మహ్మద్ ఇక్బాల్ టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరోవైపు సీఎం జగన్ సమక్షంలో పలువురుర టీడీపీ, జనసేన కీలక నేతలు వైసీపీలో చేరారు. మేమంతా సిద్దం బస్సుయాత్రలో పల్నాడు జిల్లా గంటావారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం వైఎస్.జగన్ సమక్షంలో వారంతా వైసీపీలో చేరారు. పి.గన్నవరం జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరదేవి, రాయచోటి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేశ్లు వైసీపీలో చేరారు. ఇంకోవైపు వైసీపీ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్రెడ్డి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.