టూర్ కోస‌మ‌ని తీసుకెళ్లి.. విద్యార్థినిపై ప్రిన్సిప‌ల్ అత్యాచారం

Uttar Pradesh | విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిలా మారాడు. ఓ 9 మంది విద్యార్థినుల‌ను టూర్ కోస‌మ‌ని తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత ఓ అమ్మాయికి ఆహారంలో మ‌త్తు ప‌దార్థాలు క‌లిపి ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన ఆ విద్యార్థినిపై ప్రిన్సిప‌ల్ అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ జిల్లాలో ఈ ఏడాది న‌వంబ‌ర్ 23న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. మీర‌ట్‌లోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు చెందిన ప్రిన్సిప‌ల్.. ఓ 9 మంది విద్యార్థినులను […]

  • Publish Date - December 12, 2022 / 07:54 AM IST

Uttar Pradesh | విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిలా మారాడు. ఓ 9 మంది విద్యార్థినుల‌ను టూర్ కోస‌మ‌ని తీసుకెళ్లాడు. ఆ త‌ర్వాత ఓ అమ్మాయికి ఆహారంలో మ‌త్తు ప‌దార్థాలు క‌లిపి ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన ఆ విద్యార్థినిపై ప్రిన్సిప‌ల్ అత్యాచారం చేశాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ జిల్లాలో ఈ ఏడాది న‌వంబ‌ర్ 23న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

మీర‌ట్‌లోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు చెందిన ప్రిన్సిప‌ల్.. ఓ 9 మంది విద్యార్థినులను టూర్ కోస‌మ‌ని బృందాన్‌కు న‌వంబ‌ర్ 23న తీసుకెళ్లాడు. అక్క‌డే ఓ హోట‌ల్‌ను బుక్ చేశాడు ప్రిన్సిప‌ల్. ఒక గ‌దిలో 8 మంది అమ్మాయిల‌ను ఉంచాడు. మ‌రో గ‌దిలో 11వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థిని(17)ని ఉంచాడు. ఈ అమ్మాయి గ‌దిలోనే ప్రిన్సిప‌ల్ కూడా ఉన్నాడు. అయితే ఆ అమ్మాయి తినే భోజ‌నంలో మ‌త్తు ప‌దార్థాలు క‌లిపాడు ప్రిన్సిప‌ల్.

ఇక భోజ‌నం చేసిన కాసేప‌టికే విద్యార్థిని స్పృహ కోల్పోయింది. అనంత‌రం ఆమెపై ప్రిన్సిప‌ల్ అత్యాచారం చేశాడు. మెల‌కువ రావ‌డంతో అమ్మాయి ప్ర‌తిఘ‌టించింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు చెబితే చంపేస్తాన‌ని బెదిరించాడు. ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ చేస్తాన‌ని హెచ్చ‌రించాడు.

న‌వంబ‌ర్ 24వ తేదీన విద్యార్థినులంద‌రూ త‌మ నివాసాల‌కు చేరుకున్నారు. బాధితురాలు మొద‌ట్లో మౌనంగానే ఉన్న‌ప్ప‌టికీ, త‌న‌కు జ‌రిగిన అవ‌మానంపై శ‌నివారం పేరెంట్స్‌కు చెప్పింది. దీంతో త‌ల్లిదండ్రుల‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రిన్సిప‌ల్ ప‌రారీలో ఉన్నాడు.

Latest News