చిగురుమామిడి మండలం సుందరగిరిలో విషాదం
విధాత:, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన శనిగరం ఆంజనేయులు(37) క్రికెట్ ఆడేందుకు తోటి స్నేహితులతో కలిసి హుస్నాబాద్ కు వెళ్లాడు.
అక్కడ క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.గమనించిన తోటి స్నేహితులు హుస్నాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఆంజనేయులుకు భార్య, తల్లి ఉన్నారు. మృతుడి కుటుంబానికి పలువురు సానుభూతి ప్రకటించారు. మృతుడు ఆంజనేయులు తండ్రి గతంలో కూడా గుండెపోటుతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.