విధాత: హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిని అత్యంత దారుణంగా చంపి, మ్యాన్హాల్లో పడేశాడు. అయితే హత్య చేసిందేమో శంషాబాద్లో.. మృతదేహాన్ని పడేసిందేమో సరూర్నగర్లో. వివరాల్లోకి వెళ్తే.. సరూర్నగర్కు చెందిన పూజారి వెంకట సాయికృష్ణ(36).. అదే ప్రాంతంలో ఉంటున్న అప్సర (30) అనే యువతితో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఇక ఆమెతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. అయితే సాయికృష్ణకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం అప్సరకు […]
విధాత: హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిని అత్యంత దారుణంగా చంపి, మ్యాన్హాల్లో పడేశాడు. అయితే హత్య చేసిందేమో శంషాబాద్లో.. మృతదేహాన్ని పడేసిందేమో సరూర్నగర్లో. వివరాల్లోకి వెళ్తే..
సరూర్నగర్కు చెందిన పూజారి వెంకట సాయికృష్ణ(36).. అదే ప్రాంతంలో ఉంటున్న అప్సర (30) అనే యువతితో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఇక ఆమెతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. అయితే సాయికృష్ణకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ విషయం అప్సరకు తెలియదు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని అప్సర సాయికృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆమెను అడ్డుతప్పించుకోవాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. దీంతో జూన్ 3వ తేదీన అప్సరను సరూర్నగర్ నుంచి శంషాబాద్ వైపునకు తీసుకెళ్లాడు. నర్కుడ వద్దకు వచ్చిన తర్వాత అప్సరకు ట్యాబ్లెట్ ఇచ్చి మత్తులోకి దించాడు. ఆ తర్వాత ఆమె తలపై బండరాయితో కొట్టి చంపేశాడు.
అనంతరం మృతదేహాన్ని కవర్లో పెట్టి సరూర్ నగర్ తీసుకొచ్చాడు. అక్కడే ఒక మ్యాన్హోల్లో పడేశాడు. దాన్ని కాంక్రీట్తో పూడ్చేశాడు. అనంతరం తనకు ఏమి తెలియనట్లుగా ఈ నెల 5న శంషాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్లి అప్సర అదృశ్యమైందని ఫిర్యాదు చేశాడు.
అప్సర స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్తానని చెప్పడంతో ఆమెను శంషాబాద్ అంబేడ్కర్ విగ్రహం వద్ద డ్రాప్ చేశానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సాయికృష్ణపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.