Legislative Council
విధాత: ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు శాసనమండలిని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎమ్మెల్సీలు కవిత , వాణి దేవి స్వాగతం పలికారు. మండలి పనితీరును గురించి ఎమ్మెల్సీ కవిత వారికి వివరించారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం అంతా కలిసి చైర్మన్ చాంబర్లో ఫొటో దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ విద్యార్థులు మండలి పనితీరు తెలుసుకోవడంతో ప్రజాసేవపై ఆసక్తి పెరుగుతుందన్నారు.