Karmika Bheema ధనానికి ఇంధనం కార్మికుల చెమట చుక్కలే సిద్దిపేటలో కార్మికులకు హరీశ్రావు వరాలు కార్మికుడి కార్డు రెన్యూవల్ పదేళ్లకు పెంపు లక్షన్నర నుంచి రూ.3 లక్షలకు బీమా పెంపు డిజిటల్ కార్డు రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ 5లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ఫోన్లో కార్మిక మంత్రి మల్లారెడ్డితో చర్చ విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: రైతుభీమా తరహాలో కార్మిక బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి టి.హరీశ్రావు ప్రకటించారు. […]
Karmika Bheema
విధాత, మెదక్ ప్రతేక ప్రతినిధి: రైతుభీమా తరహాలో కార్మిక బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి టి.హరీశ్రావు ప్రకటించారు. సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్ లో ఆదివారం మధ్యాహ్నం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అధ్యక్షత, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్మిక బీమా పథకం రూపకల్పనపై అప్పటికప్పుడే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కమిషనర్ రాణి కౌముదిలతో హరీశ్రావు చర్చించారు.
హరీశ్రావు సూచన మేరకు మల్లారెడ్డి ఫోన్లో కార్మికులనుద్ధేశించి మాట్లాడారు. కష్టపడ్డ..పాలు అమ్మిన, పూలు అమ్మిన, ఎమ్మెల్యేగా, మీ కార్మిక మంత్రిగా ఇవాళ మీతో మాట్లాడుతున్నానని అక్కడి సభలో కార్మికులందరినీ మల్లారెడ్డి తనదైన శైలీలో ఉత్సాహా పరిచారు. మంత్రి హరీష్రావు సూచన మేరకు సిద్ధిపేట జిల్లాతో పాటు రాష్ట్రంలో జిల్లాకొక కార్మిక భవన్ ను మంజూరు చేస్తున్నట్లుగా కార్మిక మంత్రిగా డిక్లేర్ చేస్తున్నానని మల్లారెడ్డి ప్రకటించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతు బీమా పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓ ఏజెన్సీ ద్వారా సభ్యత్వం పొందిన కార్మికుడి వేలిముద్ర సేకరించి, నామిని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, దాంతో సమగ్రమైన సమాచారం కలిగి ఉండటంతో అర్హులైన మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలం అందుతుందని వివరించారు.
ఒక్కసారి డిజిటల్ కార్డు చేసుకుంటే ఐదేళ్ల వరకే ఉండేదని, తిరిగి రెన్యూవల్ బాధలకు మీరు పడుతున్న బాధలు గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం పదేళ్లకు పెంచిందని చెప్పారు. ఇది వరకూ లక్షన్నర ఉన్న భవన నిర్మాణ కార్మికుడి భీమా ఇక నుంచి రూ.3 లక్షలకు పెంపునకు సీఎం కేసీఆర్ తో చర్చించి కృషి చేస్తానని మంత్రి హరీశ్ హామీనిచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం నా శక్తినంతా ఉపయోగిస్తానని, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, మీ వెంట, మీకు తోడుగా ఉంటానని, మీరంతా ఐక్యంగా ఉండాలని, మీ దీవెనలు,మీ ఆశీర్వాదం నాపై ఉండాలని మంత్రి కోరారు.
ఏ ప్రగతికైనా మూల ఆధారం కార్మికుడని, ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా నడిచేది కార్మికుడి కష్టం మీదనేనని, సంపాదించే ధనానికి ఇం”ధనం” కార్మికుడి చెమట చుక్కేనని రాష్ట్ర మంత్రి హరీశ్ చెప్పారు. ప్రతీ భవన నిర్మాణ కార్మికుడు కార్డు కలిగి ఉండాలని, అందుకు అవసరమైన డబ్బులు తానే వెచ్చిస్తున్నట్లు, కార్డు ఉంటేనే మీరు లబ్ధి పొందే అవకాశం ఉన్నదని, అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్డు పొందాలని, ఇందు కోసం క్యాంపు కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు, అవసరమైతే మీ అనువైన సమయం అమావాస్య రోజున ఐదు కౌంటర్లు ఏర్పాటు చేయిస్తానని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇటీవల కార్మిక-ఆరోగ్య శాఖ కార్మికుల వైద్య సేవలపై చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నదని, రూ.5లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వర్తించేలా చర్యలు ఉంటాయని మంత్రి హరీశ్ వెల్లడించారు. అలాగే క్యాన్సర్, గుండె చికిత్సలకు రూ.10 లక్షల వరకూ ఆరోగ్య భీమా వర్తించేలా ఈ ఆగస్టు నెల నుంచి అమలు కాబోతున్నదని తెలిపారు. సిద్ధిపేట శివారు మందపల్లిలో కార్మిక భవన్ నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సిద్ధిపేటలో ఎల్అండ్ టీ, సెట్విన్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రం, న్యాక్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, వాటి ద్వారా మీలో నైపుణ్యాలను పెంచుకోవచ్చునని, ఆయా శిక్షణ కేంద్రాల్లో వెళ్లేలా మీ పిల్లలను ప్రోత్సహించాలని, ఆ శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.