విధాత: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శాసన సభ్యుల కోటాలో ఏడు స్థానాలకు తాజాగా ఎన్నికలు ముగిసాయి. వాస్తవానికి ఎమ్మెల్యే సీట్ల ప్రకారం చుస్తే వైసిపికి ఆరు స్థానాలు దక్కుతాయి. ఇంకోదానికి సరిపడా ఎమ్మెల్యేల బలం లేకున్నా టీడీపీ నుంచి అప్పట్లో తమవైపు వచ్చిన ఎమ్మెల్యేలు తమకు ఓటు వేస్తారన్న నమ్మకంతో వైసిపి ఇంకో సభ్యున్ని అంటే మొత్తం ఏడుగురిని బరిలో నిలిపింది. ఇక చంద్రబాబు సైతం బీసీ మహిళా పంచుమర్తి అనురాధను బరిలో నిలిపారు. వైసిపిలో అసంతృప్తులుగా ఉన్నవాళ్లు […]
విధాత: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శాసన సభ్యుల కోటాలో ఏడు స్థానాలకు తాజాగా ఎన్నికలు ముగిసాయి. వాస్తవానికి ఎమ్మెల్యే సీట్ల ప్రకారం చుస్తే వైసిపికి ఆరు స్థానాలు దక్కుతాయి. ఇంకోదానికి సరిపడా ఎమ్మెల్యేల బలం లేకున్నా టీడీపీ నుంచి అప్పట్లో తమవైపు వచ్చిన ఎమ్మెల్యేలు తమకు ఓటు వేస్తారన్న నమ్మకంతో వైసిపి ఇంకో సభ్యున్ని అంటే మొత్తం ఏడుగురిని బరిలో నిలిపింది.
ఇక చంద్రబాబు సైతం బీసీ మహిళా పంచుమర్తి అనురాధను బరిలో నిలిపారు. వైసిపిలో అసంతృప్తులుగా ఉన్నవాళ్లు అంటే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటివారు కాకుండా ఇంకొందరు క్రాస్ ఓట్ వేస్తారని టిడిపి భావిస్తోంది. పోటీ చాలా గట్టిగా ఉండడంతో ప్రతి ఓటు కీలకంగా మారింది.
దీంతో తన కుమారుడి పెళ్లిలో ఉన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు కోసం ప్రభుత్వం ప్రత్యేక హెలికాఫ్టర్ కూడా ఏర్పాటు చేసారు. ఇక ఎన్నడూ కనిపించని గంటా శ్రీనివాసరావు కూడా టీడీపీ తరఫున వచ్చి ఓటు వేశారు. కొందరు వైసిపి సభ్యులు తమకు ఓటు వేస్తారని, ఖచ్చితంగా గెలుస్తామని టిడిపి ఆశిస్తోంది. దీంతో ప్రతి ఓటు ముఖ్యమే అయింది.
ఈ నేపథ్యంలో ప్రతి 22 మంది ఎమ్మెల్యేలకు ఒక ఇన్చార్జిని పెట్టి, మాక్ ఓటింగ్ కూడా నిర్వహించారు. ఏ ఒక్క ఓటు పోకుండా అధికారపార్టీ జాగ్రత్త పడుతోంది. ఇదిలా ఉండగా తన కుటుంబ సభ్యులను అవమానించిన కౌరవ సభలాంటి అసెంబ్లీకి తానూ మరి హాజరు కాబోనని, ముఖ్యమంత్రి అయ్యాకనే మళ్ళీ సభకు వస్తానని భీష్మ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు కూడా సభకు వచ్చి తమ అభ్యర్థికి ఓటేశారు. మొత్తానికి ఈ ఎన్నిక చాల ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో మొత్తం 175 మంది సభ్యులు కూడా ఓటేశారు. సాయంత్రం ఐదు గంటలకు ఓట్లను లెక్కిస్తారు.
ఈ ఎన్నికల్లో వైసిపి నుంచి పోతుల సునీత, మర్రి రాజశేఖర్, పెనుమత్స వివి సూర్య నారాయణ రాజు,
కోలా గురువులు, బొమ్మ ఇజ్రాయెల్, చంద్రగిరి ఏసు రత్నం, జయ మంగళ వెంకటరమణ పోటీ పడుతుండగా టిడిపి నుంచి పంచుమర్తి అనురాధ బరిలో నిలిచారు. మొత్తం ఏడు సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.