విధాత బ్యూరో, కరీంనగర్: అద్దె డబ్బు చెల్లించడంలేదని.. ఓ ప్రభుత్వ కార్యాలయానికే తాళం వేశాడు ఓ యజమాని. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట ఎంపీడీవో కార్యాలయానికి ఇంటి యజమాని చింతిరెడ్డి మల్లారెడ్డి తాళం వేయడంతో.. ఆఫీస్ సిబ్బందంతా బయటే వేచి చూస్తూ కూర్చోవాల్సిన వింత పరిస్థితి నెలకొంది. గత పదహారు నెలలుగా ఇంటి అద్దె , విద్యుత్ బిల్లు కట్టడం లేదని ఆరోపించిన ఇంటి యజమాని.. ఆగ్రహంతో తాళం వేయడం ఇల్లందకుంటలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఆఫీస్ అద్దె […]
విధాత బ్యూరో, కరీంనగర్: అద్దె డబ్బు చెల్లించడంలేదని.. ఓ ప్రభుత్వ కార్యాలయానికే తాళం వేశాడు ఓ యజమాని. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట ఎంపీడీవో కార్యాలయానికి ఇంటి యజమాని చింతిరెడ్డి మల్లారెడ్డి తాళం వేయడంతో.. ఆఫీస్ సిబ్బందంతా బయటే వేచి చూస్తూ కూర్చోవాల్సిన వింత పరిస్థితి నెలకొంది.
గత పదహారు నెలలుగా ఇంటి అద్దె , విద్యుత్ బిల్లు కట్టడం లేదని ఆరోపించిన ఇంటి యజమాని.. ఆగ్రహంతో తాళం వేయడం ఇల్లందకుంటలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఆఫీస్ అద్దె 1 లక్షా 45 వేల రూపాయలు రావాలంటున్నాడు సదరు యజమాని.
గత నాలుగేళ్లుగా అద్దె భవనంలోనే ఎంపీడీవో కార్యాలయం కొనసాగుతోంది. మరోవైపు కరెంట్ బిల్లు 21 వేల రూపాయలు కూడా చెల్లించక పోవడంతో.. విద్యుత్ అధికారులు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నాడు మల్లారెడ్డి.