Site icon vidhaatha

Nalgonda | ట్రావెల్ బస్సులో.. రూ.28 లక్షలు చోరీ

Nalgonda

విధాత: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి శివారులోని పూజిత హోటల్ ముందు ఆగిన ఆరెంజ్ ట్రావెల్ బస్ లో భారీ చోరీ కలకలం రేపింది. ఒరిస్సా నుంచి హైదరాబాద్ వెళుతున్న ఒరిస్సాకు చెందిన వ్యాపారి నుంచి రూ.28లక్షలు చోరీ అయ్యాయి.

టిఫిన్ కోసం హోటల్ ముందు బస్ ఆగిన సమయంలో ఈ చోరి జరిగింది. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు పరిశీలిస్తూ నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

Exit mobile version