Sai DharamTej | సాయి ధ‌ర‌మ్ తేజ్ వ‌ళ్ల.. త‌న గ్యారేజ్‌లో బైక్‌ల‌న్నీ అమ్మేసిన న‌రేష్ త‌న‌యుడు

Sai DharamTej | విజ‌య‌నిర్మ‌ల త‌న‌యుడు, సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కుమారుడు న‌వీన్ సినీ ప్రేక్ష‌కుల‌కి అంత సుప‌రిచితం కాదు. రెండు జెళ్ల సీత, నందిని నర్సింగ్‌ హోమ్‌, ఊరంతా అనుకుంటున్నారు వంటి సినిమాల‌లో హీరోగా న‌టించిన న‌వీన్ త‌న కెరీర్‌ని ముందుకు న‌డిపించ‌ లేక‌పోయాడు. దీంతో సినిమాల‌కి బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టి డైరెక్ట‌ర్ అవతారం ఎత్తారు. తన క్లోజ్‌ ఫ్రెండ్‌ సాయి తేజ్‌, స్వాతి కలర్స్‌ జంటగా ‘సోల్ ఆఫ్ […]

  • Publish Date - August 26, 2023 / 01:41 AM IST

Sai DharamTej |

విజ‌య‌నిర్మ‌ల త‌న‌యుడు, సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కుమారుడు న‌వీన్ సినీ ప్రేక్ష‌కుల‌కి అంత సుప‌రిచితం కాదు. రెండు జెళ్ల సీత, నందిని నర్సింగ్‌ హోమ్‌, ఊరంతా అనుకుంటున్నారు వంటి సినిమాల‌లో హీరోగా న‌టించిన న‌వీన్ త‌న కెరీర్‌ని ముందుకు న‌డిపించ‌ లేక‌పోయాడు. దీంతో సినిమాల‌కి బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మెగా ఫోన్ ప‌ట్టి డైరెక్ట‌ర్ అవతారం ఎత్తారు.

తన క్లోజ్‌ ఫ్రెండ్‌ సాయి తేజ్‌, స్వాతి కలర్స్‌ జంటగా ‘సోల్ ఆఫ్ సత్య’ పేరుతో ఒక షార్ట్‌ ఫిల్మ్‌ను తెర‌కెక్కించ‌గా, దీనికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటూ ఇంట‌ర్వ్యూల‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నాడు.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నవీన్ తన పర్సనల్‌ అండ్ ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ప‌లు విష‌యాలు తెలియ‌జేశాడు. ఇదే క్ర‌మంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ గురించి కూడా ప్ర‌స్తావించారు.

కొద్ది నెల‌ల క్రితం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. రోడ్డుపై ఉన్న ఇసుకు వల్ల ప్రమాదానికి గురయిన సాయి తేజ్ చాలా రోజుల పాటు కోమాలో ఉండి, ఆ త‌ర్వాత తిరిగి కోలుకున్నారు.

అయితే సాయిధ‌ర‌మ్ తేజ్‌కి యాక్సిడెంట్ జ‌రిగిన స‌మ‌యంలో అత‌ను ప్ర‌మాదానికి గురి కావ‌డానికి కార‌ణం ఫ్రెండ్ నవీన్ అంటూ.. కొన్ని వార్తలు పుకార్లు షికారు చేశాయి. ఈ విష‌యంపై తాజాగా స్పందించిన న‌వీన్.. సాయి తేజ్ ప్ర‌మాదం చాలా బాధించింది. సాధార‌ణంగా మేము ఇద్ద‌రం క‌లిసి బైక్ రైడ్‌కి వెళుతుంటాము. ఆ రోజు కూడా అలానే వెళ్లాము. అయితే ప్ర‌మాదం జ‌రిగిన రోజు సాయి తేజ్ ను తన ఇంటిదగ్గర దిగబెట్టి ఇంటికి వెళుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది.

తేజ్‌కి ప్ర‌మాదం జ‌రిగిందంటే అది చిన్న ప్ర‌మాద‌మే అనుకున్నాను. కాని ఆసుప‌త్రికి వెళ్లి ప‌రిస్థితిని చూసి చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను. ఇక నేను తేజ్ కి ప్ర‌మాదం జ‌రిగింద‌ని బాధ‌లో ఉండ‌గా, మీడియాలో నన్ను కారణంగా చూపిస్తూ.. కొన్ని వార్తలు రావడం ఎంతో బాధ‌ని క‌లిగించింది.

అస‌లు అప్పుడు కొద్ది రోజుల పాటు బ‌య‌ట‌కి రాలేదు. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాను. నా గ్యారేజ్‌లో ఉన్న బైక్స్ అన్ని కూడా అమ్మేసాను అంటూ న‌వీన్ చెప్పుకొచ్చాడు. ఇక న‌వీన్ ఇప్పుడు హీరోగా కెరీర్ ను వదిలేసి.. టెక్నీషియన్ గా కొత్త లైఫ్ ను మొద‌లు పెట్టాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రో మూవీకి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశాడు న‌వీన్.

Latest News