Nayanthara | ఓ తార మంచి స్థాయికి వెళ్ళి గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకుందంటే డబ్బు, పేరుతో పాటు వివాదాలు కూడా ఆమె కూడా నడుస్తాయి. అలాంటి నటీమణుల్లో ముందువరసలో ఉండే హీరోయిన్ నయనతార. నటిగా ఎంత క్రేజ్ ఉందో వివాదాల విషయంలోనూ ఆమెకు అంతే క్రేజ్. తరచుగా ఏదో విధంగా సమస్యల్లో చిక్కుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటుంది నయన్. ఆమె ప్రేమ వ్యవహారాలు, విఘ్నేష్ శివన్తో ప్రేమ, పెళ్ళి, పెళ్లయిన నాలుగు నెలలకే […]
Nayanthara |
ఓ తార మంచి స్థాయికి వెళ్ళి గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకుందంటే డబ్బు, పేరుతో పాటు వివాదాలు కూడా ఆమె కూడా నడుస్తాయి. అలాంటి నటీమణుల్లో ముందువరసలో ఉండే హీరోయిన్ నయనతార. నటిగా ఎంత క్రేజ్ ఉందో వివాదాల విషయంలోనూ ఆమెకు అంతే క్రేజ్.
తరచుగా ఏదో విధంగా సమస్యల్లో చిక్కుకుంటూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటుంది నయన్. ఆమె ప్రేమ వ్యవహారాలు, విఘ్నేష్ శివన్తో ప్రేమ, పెళ్ళి, పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లితండ్రులు కావడం అన్నీ నయనతారను చిక్కుల్లో పడేసిన విషయాలే.
నటిగా నయనతార దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. తన ఖాతాలో ఎన్నో హిట్ చిత్రాలున్నాయి. శింబు, ప్రభుదేవా ఇలా చాలా మందిలో ప్రేమలో ఉండి దాని నుంచి బయటపడి, వివాదాల్లో చిక్కుకుని, చివరిగా దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ థాన్’లో నటించినప్పుడు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. చాలా ఏళ్ళు ప్రేమలో ఉండి నెట్టింట వైరల్ అయ్యారు కూడా.
ప్రేమలో పడ్డ ఏడేళ్ళ తరవాత విఘ్నేష్, నయనతార 2022లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పెళ్ళి కాగానే తిరుపతి వెళ్ళి అక్కడి మాడవీధుల్లో చెప్పులతో తిరిగారని, ఫోటో షూట్ చేసారని వివాదంలో పడ్డారు. ఈ సంగతి కాస్త కూస్తా కాదు చాలా కాలం ఇద్దరినీ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకునేలా చేసింది.
ఇక పెళ్ళయిన నాలుగు నెలలకే సరొగసి ద్వారా ఇద్దరు కవలలకు తల్లిదండ్రులం అయ్యామని ప్రకటించి ఆశ్చర్యపరిచారు ఈ దంపతులు. ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 2016లో మేం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని, డాక్టర్ అనుమతితోనే బిడ్డలు పుట్టారని ఆధారాలు చూపితే కానీ ఆ వివాదం సర్దుకోలేదు.
ఈ జూన్ 9న తమ వివాహం జరిగి సంవత్సరం పూర్తయిందని మీడియా ముఖంగా ఇద్దరూ సంతోషంగా ప్రకటించారో లేదో మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా విఘ్నేష్ నయనతార ఫ్యామిలీ మీద ఆస్తి అపహరణ కేసు నమోదైంది.
విఘ్నేష్ తండ్రి తరపున ఉమ్మడి ఆస్తిని అమ్మేసుకున్నారని, విఘ్నేష్ బాబాయి కొడుకులు వచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ ఉమ్మడి ఆస్తిని తిరిగి కొనుగోలు చేయాలని, అలా చేయని పక్షంలో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు విఘ్నేష్ తమ్ముళ్ళు. ఇదే కాకుండా ఈ కేస్లో నయనతారతో పాటు తల్లి మీనా కుమారి, సోదరి ఐశ్వర్యల పేర్లు కూడా కలిపి, వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఫైల్ చేశారు.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ తలనొప్పి నుంచి నయనతార ఎలా బయటపడుతుందో తెలియదు కానీ.. నయనతార మాత్రం ఏదో రకంగా కాంట్రవర్సీలో ఉంటూనే ఉంటుందన్నది ఇక్కడ పాయింట్. అంటే ఆమెకి కొత్తేం కాదు కానీ.. పెళ్లి తర్వాత కూడానా? అంటూ ఆమె అభిమానులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.