యజమాని అశోక్ ఇంటిపై దాడికి యత్నంచిన మృతుడి బంధువులు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి.. భారీగా మోహరించిన పోలీసులు. మంత్రి IK రెడ్డి సొంత గ్రామంలో ఘటన విధాత, అదిలాబాద్ ప్రతినిధి: నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంగళవారం నాడు నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపల్లికి చెందిన అశోక్ వద్ద పనిచేసే ట్రాక్టర్ డ్రైవర్ నవీన్ తమ పొలం కాడ అనుమానస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు […]
విధాత, అదిలాబాద్ ప్రతినిధి: నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంగళవారం నాడు నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపల్లికి చెందిన అశోక్ వద్ద పనిచేసే ట్రాక్టర్ డ్రైవర్ నవీన్ తమ పొలం కాడ అనుమానస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకొని చెట్టుకు ఉరివేసుకోవాల్సిన పరిస్థితి తనకు లేదని కావాల్సికొని యజమాని ఈ అఘత్యానికి పాల్పడ్డాడని ఆరోపించారు.
నవీన్ కుటుంబ సభ్యులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని అశోక్, డ్రైవర్ నవీన్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అశోక్ ఇంటిపై దాడి చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఎలాంటి ఆందోళనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో భారీ బందోబస్తు చేపట్టారు. గ్రామంలోకి బయటి వ్యక్తులు వెళ్లకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.