MEDAK | విధాత, మెదక్ బ్యూరో: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మెదక్ నియోజక వర్గ టికెట్ కేటాయించడంతో నియోజవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ప్రకటన వచ్చిన వెంటనే పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ముందు టపాసులు కాల్చి రాందాస్ చౌరస్తా వద్ద కు బైక్ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా వద్ద సంబరాలు […]
MEDAK |
విధాత, మెదక్ బ్యూరో: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి మెదక్ నియోజక వర్గ టికెట్ కేటాయించడంతో నియోజవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు.
ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ప్రకటన వచ్చిన వెంటనే పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ముందు టపాసులు కాల్చి రాందాస్ చౌరస్తా వద్ద కు బైక్ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించి టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా మెదక్ మునిసిపల్ చైర్మెన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మెదక్ పార్టీ పట్టణ అధ్యక్షులు గంగాధర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి జాబితాలోనే 115 మంది అభ్యర్థులను ప్రకటించి దమ్మున్న నాయకుడని నిరూపించుకున్నాడన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవకే అంకితమైన పద్మా దేవేందర్ రెడ్డి గెలుపు ఖాయమైందని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గెలుపును అడ్డుకోలేరని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. పద్మాదేవేందర్ రెడ్డి ని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా, సీఎం కేసీఆర్ తనకు టికెట్ ప్రకటించిన 30 నిమిషాల్లోనే మెదక్ లోని తన క్యాంప్ కార్యాలయానికి పద్మా దేవేందర్ రెడ్డి చేరుకొన్నారు. క్యాంప్ కార్యాలయంలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ను పూల మాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.