PM Modi భద్రకాళి దేవస్థానం ప్రాంగణం ప్రత్యేక ముస్తాబు ప్రధానికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్లు రోడ్డు మార్గంలో ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్కు వరంగల్ సిటీ లో మూడు అంచల భద్రత ఏర్పాటు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భారతదేశ ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం శ్రీ భద్రకాళి దేవాలయం ఆవరణకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు అధికారులు ప్రధానికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికినారు. ముందుగా ఆలయ ఆవరణలో గల […]
PM Modi
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భారతదేశ ప్రధానమంత్రి మంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం శ్రీ భద్రకాళి దేవాలయం ఆవరణకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు అధికారులు ప్రధానికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికినారు.
ముందుగా ఆలయ ఆవరణలో గల గోశాల నందు గో సేవలో పాల్గొని గోవులకు గ్రాసాన్ని తినిపించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ఆలయ విశిష్టతలను తెలుసుకున్నారు.
మోడీకి కలెక్టర్ల స్వాగతం
వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి మామునూరు వద్ద వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు స్వాగతం పలికారు. హైదరాబాద్ హకీంపేట నుంచి వాయి సేన హెలికాప్టర్లో మామునూరు ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు శనివారం ఉదయం ప్రధాని చేరుకున్నారు. ప్రధానికి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పటేల్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం తెలియజేశారు.
రోడ్డు మార్గంలో భద్రకాళికి
అనంతరం రోడ్డు మార్గంలో మామునూరు నుంచి భద్రకాళి దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ పూజలు చేసినా అనంతరం అభివృద్ధి పనులు ప్రారంభించే ఆర్ట్స్ కళాశాల మైదానానికి రోడ్డు మార్గంలో వెళ్లారు.
అభివృద్ధి పనుల ప్రారంభం అనంతరం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో జరిగే బిజెపి భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. మోడీ రాక సందర్భంగా వరంగల్ సిటీలో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు అడుగడుగున నిగా కొనసాగుతోంది.