New Year Celebration | కొత్త ఏడాది వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించనున్నట్లు అవినాశ్ మహంతి తెలిపారు. ఓఆర్ఆర్, నగరంలోని వంతెనలపై రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు యూనిఫాం తప్పనిసరిగా ధరించాల్సిందేనన్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపితే యజమానిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తూ వాహనాలు నడిపితే చర్యలుంటాయన్నారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని పోలీసులు తెలిపారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు.