Priyanka sabha
విధాత: కాంగ్రెస్ పార్టీ ఈ నెల20వ తేదీన కొల్లాపూర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వాయిదా పడింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరు కానున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్లో మార్పుల కారణంగా సభ వాయిదా పడినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
దీంతో ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక కూడా ఆలస్యం కానున్నది. అయితే ప్రియాంక పర్యటన ఆగస్ట్లో ఉండే అవకాశం ఉందని, అప్పుడే కొల్లాపూర్లో సభ నిర్వహించి ఆసభలోనే కాంగ్రెస్లో చేరతానని జూపల్లి తెలిపారు.