విధాత: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని PRTU నల్గొండ జిల్లా శాఖ పక్షాన జిల్లా అధ్యక్షుడు డివిఎస్ ఫణి కుమార్, ప్రధాన కార్యదర్శి కాలం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డితో జరిగిన భేటీలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను PRTU నాయకులు మంత్రికి వివరించి వాటి పరిష్కారం కోరుతు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా PRTU సంఘానికి నూతనంగా […]
విధాత: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని PRTU నల్గొండ జిల్లా శాఖ పక్షాన జిల్లా అధ్యక్షుడు డివిఎస్ ఫణి కుమార్, ప్రధాన కార్యదర్శి కాలం నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డితో జరిగిన భేటీలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను PRTU నాయకులు మంత్రికి వివరించి వాటి పరిష్కారం కోరుతు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా PRTU సంఘానికి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు డివీఎస్ ఫణి కుమార్కు శుభాకాంక్షలు తెలియచేశారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నదని సాధ్యమైనంత త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనను కలిసిన నల్గొండ పిఆర్టియు కమిటీ సభ్యులను మంత్రి సన్మానించారు.
మంత్రి కి అందించిన వినతి పత్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు CPS రద్దు పరిచి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరింప చేయాలని, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియపై హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి సాధ్యమైనంత త్వరలో బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పిఆర్సి కమిటీ ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించి అమలు చేయాలని, Model school , KGBV ఉపాధ్యాయుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జ్యోతుల చంద్రశేఖర్, రామలింగారెడ్డి, సూర్యాపేట జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తంగెళ్ళ జితేందర్ రెడ్డి, పి.ఎం.టి.ఏ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్, నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాసులు, రాష్ట్ర పిఆర్టియూ పత్రిక సంపాదకవర్గ సభ్యులు నర్సింహ నాయక్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు తరాల పరమేశ్ యాదవ్, నకిరేకల్ మండల అధ్యక్షులు లోకసాని అనిత, నాయకులు కరుణాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, పసుల కాశీ యాదవ్, మామిల్ల శ్రీనివాస్ రెడ్డి, మేడిగ రఘు, బోయినపల్లి రమేష్, బత్తుల భాస్కర్, బాల్ రెడ్డి, నాంపల్లి శ్రీనివాసులు, మహేందర్ రెడ్డి, నాంపల్లి శ్రవణ్ కుమార్, తిరందాసు సత్తయ్య, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పున్న శ్రీనివాస్, మారుపాక నర్సయ్య, కుషలవరెడ్డి, విజయ్ కుమార్ వురెడ్డి, ఉప్పు సునీత, కొండ లక్ష్మి, రాయికంటి సైదులు, అంబటి శ్రీను, రాంరెడ్డి, రామచంద్రు, కపూర, యుగంధర్ రెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి, వంటల ఆనంద్, సట్టు గోపి నాయిని మధు చిక్కుల సుధాకర్ సారంగి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.