Ravindra Jadeja | స్వదేశంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియాకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. తాజాగా జట్టుకు మరో షాక్ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం రెండో టెస్టుకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్లో జరిగిన తొలి టెస్టు నాలుగో రోజు జడేజాను బెన్ స్టోక్స్ రనౌట్ చేసిన విషయం తెలిసిందే.
పెవిలియన్కు తిరిగి వస్తున్న సమయంలో రవీంద్ర జడేజా ఇబ్బందిపడుతూ రావడం స్పష్టంగా కనిపించింది. అయితే, హామ్ స్ట్రింగ్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్లో ఆడడం కష్టమని స్పష్టమవుతున్నది. తొలి టెస్టులో జడేజా రనౌట్తో తొలి మ్యాచ్లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆల్ రౌండర్ వికెట్ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.
ఇక రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్నది. విశాఖపట్నంలో జరిగే టెస్టులో ఆడడం కష్టంగానే మారింది. రవీంద్ర జడేజా భారత్ తొలి ఇన్నింగ్స్లో 87 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రెండు ఇన్సింగ్స్లలో కలిపి ఐదు వికెట్లు కూల్చాడు. హామ్ స్ట్రింగ్తో కండరాలు ఒత్తిడికి గురయ్యాయని, రెండో ఇన్నింగ్లో వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న సమయంలో బెన్ స్టోక్స్ వేసిన త్రోకు రనౌట్ కావడంతో పెవిలియన్కు చేరాడు. స్నాయువు గాయం ఎంత తీవ్రంగా ఉందో ఫిజియో పరిశీలించనున్నారు. అనంతరం జడేజాకు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించే అవకాశం ఉన్నది. అయితే, తొలి, రెండో టెస్టు మధ్య సమయం చాలా తక్కువగా ఉన్నది. కేవలం నాలుగు రోజుల్లో అలసట, గాయం నుంచి కోలుకోవడం జడేజాకు కష్టమే.
జడేజా జట్టుతో పాటు వైజాగ్ వెళ్తాడా..? బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్తాడా? అన్నది స్పష్టంగా తెలియరాలేదు. సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టు ఉదయం వెన్నునొప్పి కారణంగా గత నెలలో దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు మ్యాచ్కు కూడా జడేజా దూరమయ్యాడు. స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో రవీంద్ర జడేజా రెండో టెస్టుకు దూరమైతే కుల్దీప్ యాదవ్కు అవకాశం అవకాశం ఉన్నది.