Revanth Reddy దళిత, గిరిజనవర్గాలకు సముచితస్థానం కాంగ్రెస్ పార్టీకి ఆ ఉన్నత చరిత్ర ఉంది వరంగల్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, ఇక ముఖ్యమంత్రి ఎవరిని దానికి సంబంధించి వస్తే అవసరమైతే సీతక్కను కూడా ముఖ్యమంత్రి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో జరిగిన తానా సభల్లో దళితులు, గిరిజనుల వర్గాలకు ఉప ముఖ్యమంత్రికి అవకాశం కల్పించాలని ఎన్నారైలు రేవంత్ను కోరారు. […]
Revanth Reddy
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని, ఇక ముఖ్యమంత్రి ఎవరిని దానికి సంబంధించి వస్తే అవసరమైతే సీతక్కను కూడా ముఖ్యమంత్రి చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో జరిగిన తానా సభల్లో దళితులు, గిరిజనుల వర్గాలకు ఉప ముఖ్యమంత్రికి అవకాశం కల్పించాలని ఎన్నారైలు రేవంత్ను కోరారు.
దీనిపై స్పందించిన రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందరికీ అవకాశాలు ఇస్తుందన్నారు. అవసరమైతే సీతక్కను ముఖ్యమంత్రిని కూడా చేస్తుందని స్పందించారు. గతంలో కూడా ఈ వర్గాలను ముఖ్యమంత్రి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని వివరించారు. ఈ వ్యాఖ్యల పై వరంగల్ పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారి తీసింది.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర నాయకులమంతా కలిసికట్టుగా పనిచేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి వస్తే పోలవరం, అమరావతిని కట్టేది కాంగ్రెస్ పార్టీయే చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏదైనా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను నిత్యం కష్టపడుతూ ఉంటాడని హామీ ఇచ్చారు. ప్రతిక్షణం పార్టీ కోసం పనిచేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్నారైలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.