మోదీని జైలుకు పంపుతాం.. మీసా భారతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

  • Publish Date - April 11, 2024 / 10:15 PM IST

విధాత ప్రతినిధి: దేశ‌వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంటోంది. ఎన్నిక‌ల ప్ర‌చార నేప‌థ్యంలో ప‌లువురు రాజ‌కీయ నేత‌లు ప్ర‌ధానీ మోదీ, బీజేపీల‌పై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి. బీహార్‌లో లాలు ప్ర‌సాద్ కుమార్తె డాక్ట‌ర్ మీసా భార‌తి, చ‌త్తీస్‌ఘడ్‌లో కొవ్వాసి ల‌క్మాలు ప్ర‌ధాన మంత్రి మోదీపై వేసిన సెటైర్లు నెట్ ఇంట్లో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతున్నాయి.వివరాల్లోకివెళితే.. బీహార్ రాష్ట్రంలోని పాట‌లీపుత్ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్య‌ర్థి మీసా భార‌తి గురువారం మ‌న్నేరు పట్ట‌ణంలో నిర్వ‌హించిన ప్ర‌చారంలో మాట్లాడుతూ.. ప్రజలు ఇండియా కూటమిపై విశ్వాసముంచి గెలిపిస్తే లంచగొండి మోదీని జైలుకు పంపిస్తాం, ఆయననే కాదు బీజేపీ ముఖ్య నాయకులంతా జైల్లోనే ఉంటారని వెల్ల‌డించింది. ఈ వ్యాఖ్యలపై అక్కడ ఉన్న ప్రజలంతా పెద్ద ఎత్తున మద్దతుగా నినాదాల హోరెత్తించారు. ఇంకేముంది మీసా చేసిన కామెంట్లు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి.

మరో సంఘటనలో చత్తీస్ ఘఢ్, బస్తర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొవ్వాసీ లక్మా బుధవారం బీజాపూర్ జిల్లాలోని కుట్రు లో బహిరంగ సభ లో ప్రసంగిస్తూ.. కొవ్వాసి లక్మా గెలుస్తాడు నరేంద్ర మోడీ చస్తాడు అనే నినాదాల హోరెత్తించాయి. దానితో అందరి దృష్టి ఈ నినాదాల పై పడి కాంగ్రెస్ అభ్యర్థి ఇచ్చిన ఈ నినాదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. ఈ రెండు చోట్ల విడివిడిగా బీజేపీ పై ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, ప్రధానమంత్రిని ఇంత నీచంగా మాట్లాడటం సరిగా లేదని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనావీజ్ , బీజేపీ జాతీయ జనరల్ సెక్రెటరీ వినోద్ తావ్డే ఖండించారు.

Latest News