కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి సముద్రాల, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావులు

బీఆరెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులు కాంగ్రెస్‌లో చేరారు. వారు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు

  • Publish Date - April 16, 2024 / 03:10 PM IST

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులు కాంగ్రెస్‌లో చేరారు. వారు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి వారిని పార్టీలోకి రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిజమాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జా తదితరులు పాల్గొన్నారు. బీఆరెస్ నేతలు ఒక్కోక్కరు కారు దిగిపోతు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. నిన్న బోథ్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, చిలుముల మధన్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరారు.

Latest News