SIM Card Rule | ఇటీవల వెలుగులోకి వస్తున్న సిమ్కార్డుల అక్రమాల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. సిమ్కార్డులను విక్రయిస్తున్న డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేసినట్లు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దీంతో నకిలీ సిమ్కార్డుల విక్రయాలకు, ఒకరికి ఒకటికంటే ఎక్కువ సిమ్కార్డుల విక్రయాలు జరుగకుండా అడ్డుకట్టపడుతుందన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 52లక్షల మొబైల్ కనెక్షన్లు బ్లాక్ చేయగా.. 67వేల మంది డీలర్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. […]
SIM Card Rule |
ఇటీవల వెలుగులోకి వస్తున్న సిమ్కార్డుల అక్రమాల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. సిమ్కార్డులను విక్రయిస్తున్న డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ను తప్పనిసరి చేసినట్లు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. దీంతో నకిలీ సిమ్కార్డుల విక్రయాలకు, ఒకరికి ఒకటికంటే ఎక్కువ సిమ్కార్డుల విక్రయాలు జరుగకుండా అడ్డుకట్టపడుతుందన్నారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు 52లక్షల మొబైల్ కనెక్షన్లు బ్లాక్ చేయగా.. 67వేల మంది డీలర్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మరో వైపు ఈ సంవత్సరం మే నుంచి సిమ్కార్డు డీలర్లపై దాదాపు 300 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. నకిలీ సిమ్కార్డుల రాకెట్లో పాల్గొన్న 66వేల వాట్సాప్ అకౌంట్లు సైతం బ్లాక్ అయ్యాయి.
కొత్తగా టెలికాం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. పోలీస్ వెరిఫికేషన్ లేకుండా సిమ్కార్డులను విక్రయిస్తే రూ.10లక్షల వరకు జరిమానా విధించనున్నారు. దేశంలో దాదాపు 10లక్షల మంది వరకు సిమ్కార్డు డీలర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉండనున్నది. అలాగే వ్యాపారం, దుకాణాల కోసం కేవైసీని చేయించుకోవాల్సి ఉంటుంది.