Site icon vidhaatha

పెట్టుబడులతో పాటు సామాజికాభివృద్ధికి తోడ్పాటు

– ముందుకొచ్చిన హిందుస్థాన్ కోకా కోలా బెవెరేజెస్

– మంత్రి కొండా సురేఖతో కంపెనీ ప్రతినిధుల భేటీ

తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ప్రముఖ కూల్‌ డ్రింక్స్‌ తయారీ కంపెనీ హిందుస్థాన్ కోకా కోలా బెవెరేజెస్ ముందుకొచ్చింది. అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కంపెనీ ప్రతినిధుల బృందం మంగళవారం భేటీ అయ్యింది. నీరు ఘన వ్యర్థాల నిర్వహణలో సామర్థ్యం పెంపు, వ్యర్థ జలాల పునర్వినియోగం, యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రికి చెప్పారు. కోకా కోలా రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు.


సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉందని, రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యమవుతుందని స్పందించారు. అందుకు తగిన విధంగా ప్రాజెక్టులను విస్తరిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో తాగునీటి ట్యాంక్ లు, స్కూళ్లలో మొబైల్ టాయిలెట్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ నిర్మిస్తామని, వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని మంత్రికి ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోకాకోలా బెవరేజేస్ పబ్లిక్ అఫైర్స్ చీప్ హిమన్సు, క్లస్టర్ హేడ్ ముకుందు త్రివేది, బాపూయే, ఓఎస్డీ సుమంత్ పాల్గొన్నారు.

Exit mobile version