జూబ్లీహిల్స్లో మోదీ కేసీఆర్ ఓ వైపు రాహుల్ రేవంత్ మరోవైపు: సీఎం రేవంత్
ఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసిందని సీఎం అన్నారు. ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరం, కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లే అని తెలిపారు. జూబ్లీహిల్స్లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోందన్నారు.
హైదరాబాద్, నవంబర్ 05 (విధాత): జూబ్లీహిల్స్ లో మోదీ, కేసీఆర్ ఒక వైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మరో వైపు నిలబడ్డారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. పాస్టర్ల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నన్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. భారత్ జోడో పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలోని మైనార్టీలకు ఒక భరోసా ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎనిమిది చోట్ల డిపాజిట్ రాలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసిందని సీఎం అన్నారు. ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరం, కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లే అని తెలిపారు. జూబ్లీహిల్స్లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోందన్నారు.
కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్పందించలేదని, ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ని ఈడీ ఆఫీసు కు పిలిచి విచారణ చేశారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ను మాత్రం విచారణ కు పిలవడం లేదని మండిపడ్డారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉంది. గతంలో కవిత నే ఈ విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసేందుకు జూబ్లీహిల్స్ ను ప్రయోగశాల గా చూస్తున్నారని సీఎం ఆరోపించారు.
కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క దళితుడే మంత్రిగా ఉన్నాడు, మా మంత్రి వర్గంలో నలుగురు దళితులకు మంత్రులుగా అవకాశం కల్పించామని, అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ కి అవకాశం ఇచ్చామన్నారు. అత్యంత నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్,ఎంఎల్ఏ లు లక్ష్మీకాంత రావు,శ్రీ గణేష్,మాజీ ఎంఎల్ఏ సంపత్ కుమార్,తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్,ఏఐసీసీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు అనిల్ థామస్ పాల్గొన్నారు.
Also Read:Hyderabad Crime News : దారుణం.. చట్నీ మీద పడేశాడని వ్యక్తి దారుణ హత్య!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram